కేసీఆర్ ను, కవితను టార్గెట్ చేస్తున్న కేంద్రమంత్రులు!!
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. బీజేపీని గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం బిజెపికి కూడా చావో రేవో అన్నట్టుగా మారడంతో జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. తాజాగా కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, అశ్వినీ చౌబే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, కవితలను టార్గెట్ చేశారు.
అవినీతికి వ్యతిరేకంగా బిజెపిని గెలిపించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారనీ కేంద్ర యువజన,క్రీడా శాఖామాత్యులు అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన పార్టీ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... మునుగోడు గడ్డమీద భారీ మెజార్టీతో బిజెపి గెలుస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో BRS మరియుBjp కి మధ్య మాత్రమే పోటీ ఉందని అన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి కల సాకారం అవుతుందని, అందుకే బీసీ లు అంతా ఏకం అయ్యి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అశ్విని చౌబే హన్మకొండలో పర్యటించారు. హంటర్ రోడ్ లో మీడియా సెంటర్ ను ప్రారంభించిన ఆయన కేసీఆర్ ను, కవితను టార్గెట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తామంటూ కేంద్ర మంత్రి అశ్విని చోబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్లు ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని, బీజేపీని ఎదుర్కోలేక రెండూ ఏకం అయ్యాయని అన్నారు. తెలంగాణలో కమలం వికసిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications