'సహారా కేసులో కెసిఆర్ రూ.1250 కోట్ల అక్రమాలు, కవితకు 100 ఎకరాలు'

గజ్వెల్: సహారా కేసులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రూ.1250 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి శనివారం నాడు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ అక్రమార్జనతోనే ఫాంహౌస్ భూములను కొనుగోలు చేశారని, పత్రికను కొని, టీవీ ఛానల్ ఏర్పాటు చేశారన్నారు. కెసిఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో ఆయన కూతురు కవిత 100 ఎఖరాల భూమిని కొనుగోలు చేసిందన్నారు. 1981లో కెసిఆర్‌కు ఉన్న ఆస్తులపై, నేటి ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు.

K Chandrasekhar Rao

త్వరలో సిఎం కెసిఆర్ కుటుంబ అక్రమ ఆస్తుల చిట్టా విప్పుతానని చెప్పారు. సహారా కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కెసిఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐకి సహకరించి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.

ఆరోపణలు రాగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కొన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సహారా కేసులో ఇప్పటి వరకు కెసిఆర్ నోరు విప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నిజాలు బయటపెట్టాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+