'సహారా కేసులో కెసిఆర్ రూ.1250 కోట్ల అక్రమాలు, కవితకు 100 ఎకరాలు'
గజ్వెల్: సహారా కేసులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రూ.1250 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి శనివారం నాడు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆ అక్రమార్జనతోనే ఫాంహౌస్ భూములను కొనుగోలు చేశారని, పత్రికను కొని, టీవీ ఛానల్ ఏర్పాటు చేశారన్నారు. కెసిఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో ఆయన కూతురు కవిత 100 ఎఖరాల భూమిని కొనుగోలు చేసిందన్నారు. 1981లో కెసిఆర్కు ఉన్న ఆస్తులపై, నేటి ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు.

త్వరలో సిఎం కెసిఆర్ కుటుంబ అక్రమ ఆస్తుల చిట్టా విప్పుతానని చెప్పారు. సహారా కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కెసిఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐకి సహకరించి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.
ఆరోపణలు రాగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కొన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సహారా కేసులో ఇప్పటి వరకు కెసిఆర్ నోరు విప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నిజాలు బయటపెట్టాలన్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications