కొందరు కుర్చీ కోసం కులాన్ని వాడుకుంటారు: దాసరి ఇంటికి వెంకయ్య
ఇటీవల మృతి చెందిన దర్శకరత్న దాసరి నారాయణ రావు కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన దర్శకరత్న దాసరి నారాయణ రావు కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
దాసరి అందరి గురించి ఆలోచించేవాడు
దాసరి నారాయణ రావు అందరి గురించి ఆలోచించే వ్యక్తి అన్నారు. కొందరు రాజకీయ నాయకులు కుర్చీ కోసం కులాన్ని వాడుకుంటారని వెంకయ్య అన్నారు.
ఫ్యామిలికీ వెంకయ్య సంతాపం
దాసరి మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నానన్నారు. కాగా, గత నెల 30న దర్శకుడు దాసరి మృతి చెందిన విషయం తెలిసిందే.
కాంస్య విగ్రహం
ఇదిలా ఉండగా, దాసరి నారాయణరావు సంతాప సభ ఈ నెల 11న మాదాపూర్లోని ఇమేజ్ గార్డెన్స్లో జరగనుంది. ఈ సందర్భంగా దాసరి కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్నిఅనకాపల్లికి చెందిన శిల్పి కామధేనువు ప్రసాద్ తయారు చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు కోరారని..
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడారు. సంతాప సభలో దాసరి విగ్రహాన్ని ఏర్పాటు చేసే నిమిత్తం దీనిని తయారు చేయాలని కుటుంబ సభ్యులు కోరినట్టు చెప్పారు. దీంతో పాటు, ఫిలింనగర్లో ఏర్పాటు చేసేందుకు తొమ్మిది అడుగుల దాసరి విగ్రహాన్నీ తయారు చేస్తున్నట్టు చెప్పారు.