'హైదరాబాద్లో గల్లీ గల్లీ తెలిసిన మంత్రులుండగా, కేటీఆర్కు అన్ని శాఖలా?'
హైదరాబాద్: ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఒక్కడికే అన్ని శాఖలు ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంత రావు గురువారం నాడు ప్రశ్నించారు. కేటీఆర్కు అన్ని శాఖలు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
నగరంలో రోడ్లు, నాలాలు బాగుపడలేదు కానీ కేటీఆర్ మాత్రం విదేశాలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. గల్లీ గల్లీ తెలిసిన నగర మంత్రులకు మున్సిపల్ శాఖ ఇస్తే మంచిదని వి హనుమంత రావు అభిప్రాయపడ్డారు.
ఇలాంటి రోడ్లను చూస్తే పెట్టుబడిదారులు రారని తనకు భయంగా ఉందని విహెచ్ అన్నారు. జిల్లాలను విభజించడమే కాకుండా, ఆర్థిక సహకారం కూడా ఇవ్వాలన్నారు.

కాగా, మంత్రి కేటీఆర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో కీలక, ఎక్కువ శాఖలు ఉన్నాయి. ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్మెంట్ తదితర శాఖలు ఆయన వద్ద ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జిహెచ్ఎంసి ఎన్నికల అనంతరం కేటీఆర్ ఇమేజ్ మరింత పెరిగింది. అనంతరం ఆయనకు ఎక్కువ శాఖలు కట్టబెట్టారు.
కాగా, నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, నాయిని నర్సింహా రెడ్డి తదితరులు ఉన్నారు. వీరిలో నగరం మొత్తం తిరిగిన వారు ఉన్నారని, వారికి మున్సిపల్ శాఖను అప్పగిస్తే బాగుంటుందని విహెచ్ అభిప్రాయపడ్డారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications