రేవంత్ ఎఫెక్ట్: రాహుల్తో విజయశాంతి భేటీ, ఎఐసిసిలో కీలకపదవి?
సినీ నటి విజయశాంతి ఎఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్గాంధీతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. విజయశాంతికి పార్టీలో కీలకమైన పదవిని ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్: సినీ నటి విజయశాంతి ఎఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్గాంధీతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. విజయశాంతికి పార్టీలో కీలకమైన పదవిని ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది.మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన ముందున్న లక్ష్యమని విజయశాంతి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేయనున్నట్టు ఆమె చెప్పారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఇందులో భాగంగానే రేవంత్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించింది. రేవంత్రెడ్డితో పాటు కొందరు టిడిపి కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా విజయశాంతి హైద్రాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ కుంతియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత విజయశాంతి రాహుల్గాంధీతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

రాహుల్తో విజయశాంతి భేటీ
ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతో సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి సమావేశమయ్యారు. ఢిల్లీలో రాహుల్తో విజయశాంతి మంగళవారం నాడు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. 2014 ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు కన్పించిన విజయశాంతి రాహుల్తో భేటీ కావడంతో ఆమె రాజీకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.గతంలోనే ఆమెకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో బాధ్యతలను ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎఐసిసి ప్రకటించింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో రాహుల్తో విజయశాంతి భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఉత్కంఠగా మారింది.

కాంగ్రెస్ను అధికారంలోకి తేవడమే లక్ష్యం
పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని విజయశాంతి ప్రకటించారు. ఎన్నికల్లో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం నిర్వహించనున్నట్టు ఆమె చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని విజయశాంతి ప్రకటించారు.

ఎఐసిసిలో కీలకపదవి
సినీ నటి విజయశాంతికి ఎఐసిసిలో కీలకపదవిని కూడ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ పార్టీ వర్గాల్లో ఉంది.గతంలోనే ప్రచార కమిటీలో విజయశాంతితో పాటు అజహరుద్దీన్కు కూడ బాధ్యతలను కేటాయించారు. అయితే రేవంత్రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకు ప్రచార కమిటీ ఛైర్మెన్ బాధ్యతలను అప్పగించనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే విజయశాంతికి ప్రచార కమిటీతో పాటు ఎఐసిసి కార్యదర్శిగా బాధ్యతలు కేటాయించే అవకాశం కూడ లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపే దిశగా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపే దిశగా ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. టిఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తన బలగాన్ని, బలాన్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. టిఆర్ఎస్ను వచ్చే ఎన్నికల్లో గద్దె దింపే విశ్వసాన్ని క్యాడర్లో నింపుతోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

మారుతున్న రాజకీయ సమీకరణాలు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రేవంత్రెడ్డి ఎపిసోడ్ తర్వాత టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ముఖాముఖి పోటీ సాగుతోందా, ఇంకా ఇతర కూటములు రంగంలోకి వస్తాయా అనే విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఆయా జిల్లాల్లో నేతల వలసల కారణంగా ఆయా పార్టీల బలబలాల్లో కూడ మార్పులు చోటుచేసుకొంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications