వాంటెడ్ బీఎల్ సంతోష్.. కవిత ఈడీ విచారణ వేళ సంతోష్ పై పోస్టర్ల కలకలం!!
బీఎల్ సంతోష్ కనిపించటం లేదని కవిత ఈడీ ఇన్వెస్టిగేషన్ టైమ్ లో పోస్టర్లు హైదరాబాద్లో కలకలం రేపాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో ఈడీ విచారణకు హాజరవుతున్న వేళ, సిట్ విచారణ తప్పించుకుని తిరుగుతున్న నేత బిఎల్ సంతోష్ ను టార్గెట్ చేస్తున్నారు కొందరు. హైదరాబాద్ నగరంలో బిజెపి ముఖ్య నాయకుడు బి ఎల్ సంతోష్ కనిపించడం లేదని వివిధ ప్రాంతాలలో పోస్టర్లు వేసి ఆయనను టార్గెట్ చేస్తున్నారు.

బీఎల్ సంతోష్ పై పోస్టర్లు
ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు బి ఎల్ సంతోష్ అంటూ ఆయన ఫోటోతో పోస్టర్లు వేసి బహుమానం మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు అంటూ సంతోష్ ను టార్గెట్ చేస్తున్నారు. బి ఎల్ సంతోష్ ను పట్టించిన వారికి మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు బహుమానం ఇస్తామని పోస్టర్లలో రాసుకొచ్చారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన సూత్రధారి అయిన బిఎల్ సంతోష్ కేంద్ర దర్యాప్తు సంస్థల అండదండలతో ఈ కేసు నుంచి తప్పించుకున్నారని, సిట్ విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆయనను టార్గెట్ చేస్తున్నారు.

బిఎల్ సంతోష్ పై తెలంగాణలో చర్చ
మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో కర్ణాటక నేత, బిజెపి సీనియర్ నాయకుడైన బి ఎల్ సంతోష్ ప్రధానంగా వ్యవహరించినట్టు బీఆర్ఎస్ నేతలు కీలక ఆరోపణలు చేశారు. ఇక ఈ క్రమంలో బి ఎల్ సంతోష్ ను అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. అయితే ఈ కేసును సిపిఐ కి అప్పగించడంతో, బిఎల్ సంతోష్ కేంద్ర దర్యాప్తు సంస్థల అండతో సీట్ విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా వెలిసిన పోస్టర్లు బి ఎల్ సంతోష్ పై తెలంగాణలో చర్చకు కారణంగా మారాయి.

ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవిత.. కానీ బీఎల్ సంతోష్?
ఇక నేడు ఎమ్మెల్సీ కవిత ఈ డి విచారణకు హాజరవుతున్న వేళ, ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నోటీసులు ఇస్తే ఈ డి విచారణకు కవిత హాజరవుతూ తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కానీ బిజెపి నేతలు దొంగ దారిన విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారు అని, అందుకు బీఎల్ సంతోష్ తీరే ఉదాహరణ అన్న చర్చ బీఆర్ఎస్ పార్టీ నేతలలో ప్రధానంగా జరుగుతుంది.

బీఎల్ సంతోష్ పై పోస్టర్లు బీఆర్ఎస్ పనే
అయితే ఈ పోస్టర్లపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కావాలని బి ఆర్ ఎస్ నాయకులే ఈ పోస్టర్లు వేశారని, వెంటనే వాటిని తొలగించాలని చెబుతున్నారు. కేవలం కవితను ఈడీ విచారణ చేస్తుంటే, దాని నుండి దృష్టి మరల్చడం కోసమే ఈ విధంగా బి ఎల్ సంతోష్ పై పోస్టర్లు వేశారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications