వరంగల్ మహిళకు అరుదైన అవకాశం: మోడీతో మాట్లాడిన కౌసర్ షాహిన్ బేగం
వరంగల్: జిల్లాలోని వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సభ్యురాలు కౌసర్ షాహిన్ బేగంకు అరుదైన అవకాశం లభించింది. గత కొద్ది రోజుల నుంచి దేశంలోని వివిధ వర్గాల ప్రజలను నేరుగా పలుకరించేందుకు ప్రధాన మంత్రి జన్సంవాద్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) వర్గానికి చెందిన మహిళలతో ముచ్చటించారు. ఈ క్రమంలో మోడీతో ముచ్చటించే అవకాశం కౌసర్ షాహిన్కు లభించింది.
గురవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కౌసర్.. ప్రధానితో ముచ్చటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలు పొదుపు పాఠాలు చెప్పిన కౌసర్.. ఎంతో మంది మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ నేడు దేశవ్యాప్తంగా ఆమెకు ఖ్యాతిని పెంచింది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని కౌసర్ ఆనందం వ్యక్తం చేశారు.