12న ఓటర్ల తుది జాబితా: తెలంగాణ సీఈఓ రజత్ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రకటనకు హైకోర్టు అనుమతించిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ తెలిపారు.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, వినతులకు సంబంధించి 33 లక్షల 14 వేలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో కొత్తగా ఓటుహక్కు కోసం వచ్చిన దరఖాస్తులు 22 లక్షల 36 వేలకు పైనే ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల 872 దరఖాస్తులను ఆమోదించినట్లు వెల్లడించారు.

ముసాయిదా జాబితాలో 2 కోట్ల 61 లక్షల ఓటర్లు ఉండగా.. తుది జాబితాలో మరో 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని, ఎలాంటి లోపాలు లేకుండా ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని రజత్కుమార్ స్పష్టం చేశారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications