జైల్లో ఉన్న భర్తకు మద్యం ఇస్తూ పట్టుబడ్డ మహిళ
హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న భర్తను ములాఖత్లో కలుసుకుని మద్యం బాటిల్, సెల్ఫోన్, పొగాకు ప్యాకెట్ అందజేస్తున్న మహిళను జైలు అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.
కీసర మండలం దమ్మాయిగూడకు చెందిన ఎం. మహేష్(33)కు ఓ హత్యకేసులో శిక్ష పడింది. 2012 నుంచి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ములాఖత్లో అతడిని కలవడానికి భార్య లక్ష్మీ జైలుకు సోమవారం మధ్యాహ్నం వచ్చింది.
అనుమానం వచ్చిన జైలు అధికారులు ఇతర ఖైదీల మహిళా బంధువులతో తనిఖీ చేయగా ఆమె వద్ద మద్యం బాటిల్, సెల్ఫోన్, పొగాకు ప్యాకెట్ లభించింది. ఆమెను అదుపులోకి తీసుకుని కుషాయిగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమెను విచారిస్తున్నారు.

రూ. 52లక్షల విలువైన నిషిద్ధ గుట్కా లోడ్ పట్టివేత
నిషిద్ధ గుట్కా ప్యాకెట్లతో రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి దాటాక నల్లగొండ జిల్లా చిట్యాల మండలం శివారులో జరిగింది. గుట్కా ప్యాకెట్ల లోడును చౌటుప్పల్ రూరల్ సీఐ ప్యాకెట్లను విలేకరుల ఎదుట ప్రదర్శించారు.
అనంతరం చిట్యాల పోలీస్ స్టేషన్లో సిఐ శివరాంరెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఒరిస్సా రాష్ట్రానికి తరలిస్తున్న రూ.52 లక్షల 8 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లకు సంబంధించిన 80 బస్తాలను పట్టుకున్నామన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications