భార్యే చేసింది..: ప్రియుడితో వివాహేతర సంబంధం, భర్తను బలితీసుకంది!
హైదరాబాద్: ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే హత్య చేయించిందో భార్య. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో ఈ దారుణం చోటు చేసుకుంది. హత్య చేయడమే కాకుండా.. దాన్ని రైలు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో.. ఎట్టకేలకు నిజాలు నిగ్గు తేలక తప్పలేదు.

ప్రియుడి వ్యామోహంలో:
బోరబండ స్వరాజ్నగర్కు చెందిన ఎండీ ఖాజా(46), సలేహా బేగం(26) భార్యాభర్తలు. 11ఏళ్ల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది. నవాజ్(9), లతీఫ్(7) అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో బోరబండలోని ఓ మాంసం దుకాణంలో పనిచేసే ఎండీ తబ్రేజ్ఖురేషీ(33)తో సలేహాకు కొన్నాళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

హత్యకు సుపారీ:
భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి.. భర్త పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. సరికదా, భర్తనే అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఖురేషీతో కలసి కొంతమంది రౌడీ షీటర్లను రంగంలోకి దించింది.
ఖాజా హత్య కోసం బోరబండ సఫ్దర్నగర్కు చెందిన పాత నేరస్తుడు సయ్యద్ ముజీబ్తో రూ.2లక్షల ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.హత్య తర్వాత మిగతాది చెల్లిస్తామని చెప్పి.. మొదట రూ.30వేలు ముట్టజెప్పారు.

ఖాజాకు దగ్గరైన ముజీబ్:
ఖాజాను హత్య చేసే క్రమంలో మొదట అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు ముజీబ్. ఖాజా రోజూ వెళ్లే మద్యం దుకాణం వద్దకు వెళ్లి.. అతనితో మాటా మాటా కలిపేవాడు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
ఈ క్రమంలోనే ఖాజా హత్య కోసం మరో ముగ్గురిని రంగంలోకి దించాడు ముజీబ్. బోరబండకు చెందిన ఎండీ అయాజ్, ఎర్రగడ్డకు చెందిన మీర్జా అక్బర్ బేగ్, బోరబండ సైట్ 3 అంబేడ్కర్నగర్కు చెందిన షేక్ జహీర్లతో హత్యకు ఒప్పందం చేసుకున్నాడు.

ఇలా హత్య:
ఖాజా హత్య కోసం ఫిబ్రవరి 20న ప్లాన్ వేశారు. అనుకున్నట్టుగానే ఆరోజు ఖాజాను మద్యం తాగేందుకు తీసుకెళ్లాడు ముజీబ్. మాదాపూర్ లోని ఓ మద్యం దుకాణంలో మద్యం తాగి.. తిరిగి వస్తూ మరికొంత మద్యం కొనుగోలు చేశారు. రాత్రి 9.40గం. సమయంలో వివేకానందనగర్ కమాన్ వద్ద ఆగారు. ఆ సమయంలోనే మద్యం సేవించాలని భావించారు. కానీ ఇక్కడైతే పోలీసులు వస్తారని చెప్పి.. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లాడు ముజీబ్.

ప్రమాదంగా చిత్రీకరించారు:
ముజీబ్, ఖాజా మద్యం తాగుతున్న సమయంలోనే..రియాజ్, అక్బర్, జహీర్ వీరిని అనుసరించారు. ఖాజా మద్యం మత్తులోకి జారుకున్నాక.. బండరాయితో మోది అతన్ని చంపేశారు. ఆపై రైలు పట్టాల మీద పడేసి వెళ్లిపోయారు. దీంతో మద్యం మత్తులో పట్టాలు దాటుతూ చనిపోయాడన్న కట్టు కథ ప్రచారంలోకి వచ్చింది. అయితే పోస్టుమార్టం నివేదికలో.. మృతుడి తలకు తీవ్ర గాయాలైనట్టు తేలడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కాల్ డేటా పట్టించింది:
ఖాజా కాల్ డేటాను పరిశీలించగా.. సలేహా ప్రియుడు తబ్రేజ్ ఖురేషీ ముజీబ్తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడినట్టు తేలింది. హత్య జరిగిన సమయంలో తబ్రేజ్ కూడా అక్కడే ఉన్నట్టు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించారు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా.. అసలు నిజాలు బయటపడ్డాయి. ఖాజా భార్య సలేహా కూడా నిజాలను అంగీకరించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications