Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డెత్ మిస్టరీ : ఫ్లాష్ ఉమెన్.. చిన్న కథ కాదు అయ్యో !

మానవ సంబంధాలు నానాటికీ మంటగలిసి పోతున్నాయా అనే అనుమానం ప్రస్తుతం అందరినీ కలవర పెడుతుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యభర్తలు ఒకరిని మరొకరు దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు సర్వత్రా కలకలం రేపుతున్నాయి. పరాయి స్త్రీ కోసం కట్టుకున్న భార్యను కడతేర్చుతున్న మృగాళ్లు ఓ పక్కన ఉంటే.. మరోవైపు ప్రియుడి మోజులో పడి భర్తను కాటికి పంపుతున్నారు కొందరు భార్యలు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. లేటెస్ట్ గా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు చేసిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామంలో.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్లు నాటకం ఆడింది. బంధువులు, గ్రామస్థులను నమ్మించి ఎవరికీ అనుమానం రాకుండా అదే రోజు హడావుడిగా అంత్యక్రియలు కూడా నిర్వహించేసింది. మొదట అందరూ సహజ మరణంగానే భావించినా.. ఆలస్యంగా ఈ మోసం బయటపడటంతో నిందితురాలు పోలీసుల చేతికి చిక్కింది.

wife-killed-husband-for-extra-marital-affair-at-nizamabad

అసలేం జరిగిందంటే..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టాటి రమేశ్ (35) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య సౌమ్య స్థానిక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేసేది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్‌తో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. కొంతకాలానికి రమేశ్‌కు భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి.. భార్యను, ఆమె ప్రియుడు దిలీప్‌ను గట్టిగా మందలించి సంబంధాన్ని ముగించుకోవాలని హెచ్చరించాడు.

దీంతో సౌమ్యకు భర్తను తొలగించుకోవాలని నిర్ణయించుకొని.. తన ప్రియుడు దిలీప్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. గత నెల 20న ఇంట్లో ఎవరు లేని సమయంలో రమేశ్‌ను టవల్‌తో ఉరేసి హత్య చేశారు. ఆ సమయంలో ఎవరికి అనుమానం రాకుండా చూసుకున్నారు. హత్య అనంతరం రమేశ్ గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు, గ్రామస్థులను నమ్మించారు. ఎవరికీ అనుమానం రాకుండా అదే రోజు హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. మొదట అందరూ సహజ మరణంగానే భావించారు.

అయితే కొంతకాలం తర్వాత సౌమ్య ప్రవర్తనపై గ్రామస్థులకు అనుమానం రావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తమదైన శైలిలో విచారించగా సౌమ్య, దిలీప్ ఇద్దరూ హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలుస్తోంది. అక్రమ సంబంధం నేపధ్యంలో ఇంతటి దారుణ ఘటన చోటు చేసుకోవడం గ్రామంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చకు తెర లేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+