విప్రో ఉమెన్ స్కాలర్ షిప్కు అర్హతలివే: సిటీల్లో 36, ఇతర ప్రాంతాల్లో 24 వేలు(ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుక బడిన బాలికలను ప్రొత్సహించేందుకు, ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్న వారి ఆశలను నెరవేర్చేందుకు విప్రో కంపెనీ ముందుకొచ్చింది. బాలికల్లో ఆత్మస్తైర్యం నింపడంతోపాటు, భావితరాలకు చేయూతను అందించేందుకు గాను విప్రో నడుంబిగించింది.
ఇందులో భాగంగా సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ పథకాన్ని ఆ సంస్థ ప్రకటించింది. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని గోల్కొండ హోటల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ స్కాలర్షిప్ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ విప్రో సంస్థ బాలికల విద్యను ప్రొత్సహించడం కోసం ఉమెన్ స్కాలర్షిప్లను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు మాట్లాడుతూ ఉన్నత విద్య చదవాలనుకునే బాలికలను ప్రోత్సహించాడనికి విప్రో ఈ తరహా స్కాలర్ షిప్లను ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విప్రో ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.
బాలికలు భవిష్యత్తులో నిలదొక్కుకోవడానికి ఈ స్కాలర్షిప్లు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయని మంత్రి రావెల ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘీక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఏపీ సాంఘీక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ ఇనిస్టి ట్యూషన్ సొసైటీ సెక్రటరీ కల్నల్ వి. రాములుతో పాటుగా విప్రో ప్రతినిధులు హాజరయ్యారు.
విప్రో స్కాలర్ షిప్ కేవలం బాలికలకు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మాత్రమే చదివి ఉన్నవారికి మాత్రమే. డిగ్రీ, డిప్లొమా కోర్సులు, ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో చేరిన వారే ఈ స్కాలర్ షిప్కు అర్హులు. దరఖాస్తులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ప్రినిపాళ్ల వద్ద మాత్రమే లభిస్తాయి.
ఒక్కసారి స్కాలర్ షిప్కు ఎంపికైతే కోర్సు ముగిసే వరకు ఎన్ని సంవత్సరాలైనా స్కాలర్షిప్ను పొందవచ్చు. పట్టణ ప్రాంతాల్లో రూ. 36 వేలు, ఇతర ప్రాంతాల వారు రూ. 24 వేలను స్కాలర్షిప్ను ఈ పథకం క్రింద విప్రో సంస్థ అందిస్తోంది. ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులకు 60 శాతం, ఇతర ప్రొఫెషన్ విద్యార్థులకు మిగతా 40శాతం స్కాలర్షిప్లు కేటాయిస్తారు.
సంతూర్ ఉమెన్ స్కాలర్ షిప్లు ప్రకటించిన విప్రో
తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుక బడిన బాలికలను ప్రొత్సహించేందుకు, ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్న వారి ఆశలను నెరవేర్చేందుకు విప్రో కంపెనీ ముందుకొచ్చింది. బాలికల్లో ఆత్మస్తైర్యం నింపడంతోపాటు, భావితరాలకు చేయూతను అందించేందుకు గాను విప్రో నడుంబిగించింది.
సంతూర్ ఉమెన్ స్కాలర్ షిప్లు ప్రకటించిన విప్రో
ఇందులో భాగంగా సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ పథకాన్ని ఆ సంస్థ ప్రకటించింది. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని గోల్కొండ హోటల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ స్కాలర్షిప్ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ విప్రో సంస్థ బాలికల విద్యను ప్రొత్సహించడం కోసం ఉమెన్ స్కాలర్షిప్లను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
సంతూర్ ఉమెన్ స్కాలర్ షిప్లు ప్రకటించిన విప్రో
ఆంధ్రప్రదేశ్ సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు మాట్లాడుతూ ఉన్నత విద్య చదవాలనుకునే బాలికలను ప్రోత్సహించాడనికి విప్రో ఈ తరహా స్కాలర్ షిప్లను ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విప్రో ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.
సంతూర్ ఉమెన్ స్కాలర్ షిప్లు ప్రకటించిన విప్రో
బాలికలు భవిష్యత్తులో నిలదొక్కుకోవడానికి ఈ స్కాలర్షిప్లు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయని మంత్రి రావెల ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘీక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఏపీ సాంఘీక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ ఇనిస్టి ట్యూషన్ సొసైటీ సెక్రటరీ కల్నల్ వి. రాములుతో పాటుగా విప్రో ప్రతినిధులు హాజరయ్యారు.
సంతూర్ ఉమెన్ స్కాలర్ షిప్లు ప్రకటించిన విప్రో
విప్రో స్కాలర్ షిప్ కేవలం బాలికలకు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మాత్రమే చదివి ఉన్నవారికి మాత్రమే. డిగ్రీ, డిప్లొమా కోర్సులు, ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో చేరిన వారే ఈ స్కాలర్ షిప్కు అర్హులు. దరఖాస్తులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ప్రినిపాళ్ల వద్ద మాత్రమే లభిస్తాయి.
సంతూర్ ఉమెన్ స్కాలర్ షిప్లు ప్రకటించిన విప్రో
ఒక్కసారి స్కాలర్ షిప్కు ఎంపికైతే కోర్సు ముగిసే వరకు ఎన్ని సంవత్సరాలైనా స్కాలర్షిప్ను పొందవచ్చు. పట్టణ ప్రాంతాల్లో రూ. 36 వేలు, ఇతర ప్రాంతాల వారు రూ. 24 వేలను స్కాలర్షిప్ను ఈ పథకం క్రింద విప్రో సంస్థ అందిస్తోంది. ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులకు 60 శాతం, ఇతర ప్రొఫెషన్ విద్యార్థులకు మిగతా 40శాతం స్కాలర్షిప్లు కేటాయిస్తారు.