రోడ్డు ప్రమాదంలో వైరా ఎమ్మెల్యేకు గాయాలు: హైదరాబాద్కు తరలింపు
హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం నల్గొండ జిల్లా మోతె సమీపంలో గురువారం ప్రమాదానికి గురైంది. ఖమ్మం నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఆయన కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే మదన్ లాల్ స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన కారు డ్రైవర్, ఆయన గన్ మెన్లు ఆయన్ని సూర్యాపేటలోని ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మెల్యే మదన్ లాల్ను పరీక్షించిన వైద్యులు ఆయన నడుం కింది భాగంలో బాగా దెబ్బలు తగిలాయని, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేను హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
కాగా, ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications