నకిలీ ఏటీఎంలతో 70 లక్షలు కాజేశారు (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మారేడ్పల్లిలోని సిండికేట్ బ్యాంకు (పికెట్ శాఖ) ఖాతాదారుల డెబిట్ కార్డులను క్లోనింగ్ చేసిన నేరగాళ్లు రెండు నెలల వ్యవధిలో రూ. 70 లక్షలు కాజేశారు. వివరాలిలా ఉన్నాయి.
సికింద్రాబాద్లోని పికెట్ ఘన్శ్యామ్ సూపర్ మార్కెట్ వద్ద సిండికేట్ బ్యాంక్ ఉంది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ బ్యాంక్కు చెందిన 22 మంది ఖాతాదారుల ఖాతాల్లోని డబ్బులు డ్రా అయిపోయాయి. డ్రా చేసేందుకు వెళ్లిన ఖాతాదారులు తమ ఖాతాల్లో డబ్బులేదని తెలుసుకొని షాక్ తిన్నారు.
దీంతో బాధితులు నాలుగురోజుల క్రితం సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 22 మంది బాధితులు శనివారం ఉదయం సిండికేట్ బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకు అధికారులు బాధ్యత వహించాలని వారు ఆందోళనకు దిగారు. అధికారుల సమాచారం మేరకు మారేడ్పల్లి ఇన్ స్పెక్టర్ బ్యాంక్కు వచ్చారు.
రెండు నెలలుగా తమ ఖాతాల నుంచి డబ్బులు తీస్తున్నారని బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేస్తున్నా వారి నుంచి స్పందనే కరువైందని బాధితులు పోలీసులకు చెప్పారు. దీంతో బ్యాంకు అధికారులు బ్యాంక్ డేటాబేస్ సరిగ్గా లేక పోవడం వల్లనే ఇలా జరిగిందని వివరించారు.
నకిలీ ఏటీఎం కార్డులతో 70 లక్షలు కాజేశారు
విల్సన్ స్టాన్లీ ఖాతాలోని 3 లక్షలు, శ్రీధర్ అనే వ్యక్తి ఖాతా నుంచి 25వేలు, నరసింహరావు ఖాతా నుంచి 70వేలు, బిపిన్ పాండే ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు 56వేల నగదు డ్రా చేశారు.
నకిలీ ఏటీఎం కార్డులతో 70 లక్షలు కాజేశారు
బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేయడంతో బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. కానీ శనివారం అంతా కలిసి బ్యాంక్ వద్ద ధర్నా చేశారు.
నకిలీ ఏటీఎం కార్డులతో 70 లక్షలు కాజేశారు
ఈ నేపథ్యంలో ముంబైలోని ప్రభాదేవి రోడ్డులో ఉన్న ముంబై, న్యూఢిల్లీలోని ఏటీఎంల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు డ్రా అయినట్లు తెలిందన్నారు. సంబంధిత సీసీ కెమెరాల దృశ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
నకిలీ ఏటీఎం కార్డులతో 70 లక్షలు కాజేశారు
సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ ద్వారా ఖాతాదారుల ఏటీఎం వివరాలను దొంగిలించారని తెలుస్తోంది. ఆ వివరాలను నకిలీ ఏటీఎం కార్డుల్లోకి అప్డేట్ చేసి డబ్బులు డ్రా చేశారని చెబుతున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, త్వరలోనే బాధితుల సొమ్ము వారికి చెల్లిస్తామని తెలిపారు.