బస్టాండ్లో దించివెళ్లిన భర్త: 3రోజులైనా తిరిగిరాని కాల్ సెంటర్ ఉద్యోగిని
హైదరాబాద్: నగరంలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఓ వివాహిత మహిళ అదృశ్యమైన ఘటన గోపాలపురం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలిల ప్రకారం.. బంజారాహిల్ రోడ్డు నెంబర్ -12లో ఉంటున్న యాదగిరి భార్య రేణుక(23) ఘట్కేసర్లోని ఓ కాల్సెంటర్లో పనిచేస్తోంది.

అయితే ప్రతి రోజు భర్త యాదగిరి ఆమెను సికింద్రాబాద్లోని బ్లూసీ హోటల్ ప్రాంతం వద్దకు తీసుకుని వచ్చి వదిలి వెళ్తుంటాడు. ఆమె అక్కడ నుంచి బస్సులో పనిచేసే తన కాల్సెంటర్కు వెళ్తుంది. అయితే రోజుమాదిరిగా ఆగస్టు 1న ఆమెను భర్త యాదగిరి బ్లూసీ హోటల్ వద్ద వదిలివెళ్లాడు.
ఆమె సాయంత్రం ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త.. తెలిసిన బంధువులను వాకబు చేసినా ఆచూకీ తెలియరాలేదు. ఆమె ఫోన్ కూడా స్వీచ్ఛాప్ చేసి ఉందని, దీంతో తన భార్య కనిపించడంలేదని బాధితుడు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం గాలింపు చేపట్టారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications