సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్: వ్యభిచారం చేయాలని భార్యపై భర్త ఒత్తిడి
వ్యభిచారం చేయాలని భర్త తనను వేధిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదని చెప్పింది.
హైదరాబాద్: డబ్బు కోసం వ్యభిచారం చేయాలని ఓ భర్త భార్యను వేధిస్తున్న సంఘటన హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది. భర్త, మేనత్త తనను వ్యభిచార రొంపిలోకి దింపాలని చూస్తున్నారని వారి నుంచి తప్పించుకొని వచ్చిన ఓ వివాహిత హైదరాబాదులోని ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన శంకర్ అదే ప్రాంతానికి చెందిన అనిత నాలుగేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. తాపీ మేస్ర్తీగా పనిచేసే శంకర్ కొద్దికాలం క్రితం నగరానికి వచ్చి బోరబండ సైట్-3లో ఉంటున్నాడు. అనిత ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హౌస్కీపర్గా పనిచేస్తోంది.
విధుల నుంచి ఆలస్యంగా వచ్చి గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతున్న భార్యను శంకర్ పలుమార్లు మందలించాడు. అయినా తీరు మార్చుకోకుండా అదే విధంగా కొనసాగిస్తోంది. నాలుగు రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడ్డారు. దాంతో అనిత పాపతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సోమవారం కాలనీ మహిళలతో కలిసి ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అనిత ఫిర్యాదు మేరకు భర్త శంకర్ను స్టేషన్కు పిలిపించారు. వ్యభిచారం చేయాలంటూ వేధించాడని చెప్పిన అనిత తరువాత తనకు శంకర్తో సంసారం చేయడం ఇష్టం లేదని, కేసు పెట్టొద్దని, అతడు తన వద్దకు రాకుండా చూడాలని ఎస్ఐ లక్ష్మణ్ను వేడుకుంది. ఇరువురితో మాట్లాడి వారిని తమ తమ ఇళ్లకు పంపించారు.