హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఓ భార్య ఉదంతం నల్గొండ జిల్లాలో శనివారం జరిగింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలులో ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపింది. ఈ సంఘటన కొప్పోలులో తీవ్ర సంచలనం సృష్టించింది.

తనను ప్రేమించి మోసగించాడంటూ ప్రేమికుడైన యువకుడి ఇంటి ముందు ఓ యువతి మౌనపోరాటానికి దిగిన సంఘటన వరంగల్‌ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. వరంగల్‌ జిల్లా రేగొండ మండలం ధర్మంచపల్లిలో ప్రకాష్‌ అనే యువకుడు తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఆయన ఇంటి ముందు కరీంనగర్‌ జిల్లాకు చెందిన మానస అనే యువతి మౌనపోరాటానికి దిగింది.

 Woman kills husband with the help of lover

నిజామాబాద్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తిని దుండుగులు బండరాయితో మోది చంపారు. భిక్కనూరు మండల కేంద్రానికి సమీపంలోని 44 వ నెంబరు జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు హతమార్చారు. పోలీసులు సంఘటనస్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో గల స్వరూప్‌నగర్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, 40 సెల్‌ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

English summary
A woman in Nalgonda district of Telangana killed her husband with the help of her lover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X