హిజ్రాతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు.. చివరకు ఏం జరిగిందంటే..?
దాంపత్య జీవితంలో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతున్నారు. దాంపత్య జీవితం పట్ల నిరాసక్తత, విసుగు వున్నప్పుడు వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులను చేస్తోంది. ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది. తాజాగా ఓ యువకుడు హిజ్రాతో సంబంధం పెట్టుకుని తన జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేసుకున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక యువకుడి జీవితం విషాదాంతంగా ముగిసింది. పెళ్లయి ముగ్గురు పిల్లలున్న రామకృష్ణ(35) అనే యువకుడు ఒక హిజ్రాతో సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే, ఏప్రిల్ 11, 2025, శుక్రవారం నాడు రామకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్య, ఆత్మహత్య లేక మరేదైనా కారణమా అనేది విచారణలో తేలనుంది.ఈ విషాదకరమైన సంఘటన ఆ యువకుడి కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. రామకృష్ణ అనుమానాస్పద మృతికి హిజ్రానే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. హిజ్రాతో సంబంధం పెట్టుకోవడం వల్ల అతని జీవితం ఇలా ముగిసిందని రామకృష్ణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ రామకృష్ణ మృతి సంచలనం సృష్టిస్తోంది.












Click it and Unblock the Notifications