భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడ్ని చంపేసి లొంగుబాటు
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని కూకట్పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువకుడిని హత్య చేశానంటూ తెలుపుతూ ఓ వ్యక్తి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. తన భార్యతో వివాహేతర సంబంధం కారణంగానే తాను ఈ హత్య చేసినట్లు చెప్పాడు. నిందితుడి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యువకుడి మృతదేహం కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాదులోని లోయర్ ట్యాంక్బండ్ సమీపంలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసు
కున్నారు. మృతుడు లింబయ్య స్వస్థలం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని రత్తాలరాంరెడ్డి. అయితే కుమారుడి వైద్యం కోసం లింబయ్య నగరానికి వచ్చినట్లు సమాచారం. బుధవారం ఉదయం బస్సు కింద పడి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
కానిస్టేబుల్ అదృశ్యం
వరంగల్ జిల్లాలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సెల్వ గణపతి అదృశ్యమయ్యాడు. సికింద్రాబాద్ - మణుగూరు రైలులో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గణపతి అదృశ్యమైనట్లు కాజీపేట వద్ద తోటి కానిస్టేబుల్ వాల్య గుర్తించాడు. గణపతి అదృశ్యంపై డోర్నకల్ రైల్వే పోలీసులకు వాల్య ఫిర్యాదు చేశాడు. ఛత్తీస్గఢ్ కుంటాలోని సుక్మా బెటాలియన్లో గణపతి విధులు నిర్వహిస్తున్నాడు. గణపతి స్వస్థలం తమిళనాడులోని థేని జిల్లా అందిపట్టి గ్రామం.