టీటీడీ నుంచి ఆ సీనియర్ ఐఎఎస్ బదిలీ: సీఎంఓలో: తన శాఖకు ఏరికోరి తెచ్చుకున్న మంత్రి రోజా
తిరుపతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ ఈ ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదివారం సెలవురోజే అయినప్పటికీ- పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ దీనికి సంబంధించిన జీవోను జారీ చేశారు. మొత్తంగా- నలుగురు ఐఎఎస్ అధికారులకు ప్రభుత్వం స్థానం చలనం కల్పించింది ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని నియమించలేదు. వేరే అధికారులకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాధ్యతల నుంచి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఇక ఆయన పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తారు. ఇదివరకే ఆయనను ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ చేసినప్పటికీ.. టీటీడీ ఈఓగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పించింది.

ప్రస్తుతం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారిగా పని చేస్తోన్న ఐడీఈఎస్ అధికారి ఏవీ ధర్మారెడ్డిని ఈఓగా అపాయింట్ చేసింది. టీటీడీ ఈఓ హోదాలో ఆయన పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎం సత్యనారాయణను నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా మహ్మద్ ఇంతియాజ్కు కూడా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఆయన గ్రామీణ పేదరిక నిర్మూల సొసైటీ సీఈఓగా ఉంటోన్నారు.
యువజన సర్వీసుల శాఖ కమిషనర్గా శారదా దేవిని నియమించింది ప్రభుత్వం. ఇదివరక ఈ స్థానంలో సీ నాగరాణి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. నాగరాణిని రిలీవ్ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో శారద దేవిని అపాయింట్ చేసింది. పర్యాటకం, సాంస్కృతికం, యువజన సర్వీసు వ్యవహారాల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చోటు చేసుకున్న బదిలీ ఇది. శారదా దేవిని రోజా ఏరికోరి నియమించుకున్నట్లు చెబుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications