తిరుపతిలో కారు ప్రమాదం, పట్టించుకోని టీటీడీ ట్రాన్స్ పోర్ట్ సిబ్బంది (వీడియో)
తిరుపతి ఎస్పీ క్యాంప్ ఆఫీస్ సమీపంలో ప్రమాదం జరిగింది. టీటీడీకి చెందిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో కారు కాలి బూడిదైపోయింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్.. మరే కారణం అనే విషయం దర్యాప్తులో తేలనుంది. కానీ కారు ప్రమాదం జరగడంతో.. చుట్టు పక్కల వారు భయాందోళనకు గురయ్యారు.
టీటీడీకి చెందిన కారు మంటల్లో అగ్నికి ఆహుతి అవుతుంది. అయినప్పటికీ పట్టించుకోవాల్సిన టీటీడీ ట్రాన్స్ పోర్ట్ అధికారులు చోద్యం చూశారు. ఏమీ పట్టనట్టు బిహెవ్ చేశారు. ఈ ప్రమాదం టీటీడీ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగింది. అయినప్పటికీ వారు మిన్నకుండి పోయారు. అక్కడ గల స్థానికులు కొంచెం ట్రై చేశారు. మంటలు ఆపేందుకు ప్రయత్నించారు.
టీటీడీ ట్రాన్స్ పోర్ట్ అధికారులు మాత్రం మంటలు అంటుకున్నా ప్రేక్షకపాత్ర పోషించారు. దీంతో 17 లక్షల విలువైన టీటీడీ వాహనం అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ విజువల్లో కారు కాలిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజా ధనం అంటే విలువ లేదు.. డ్యూటీ అంటే లెక్కలేదో తెలియదు కానీ.. ట్రాన్స్ పోర్టు అధికారులు మాత్రం చేష్టలుడిగి చూశారు.
తిరుపతిలో కారు ప్రమాదం, పట్టించుకోని టీటీడీ ట్రాన్స్ పోర్ట్ సిబ్బంది#Tirupati #Ttd #Car pic.twitter.com/5yGE0LNIN0
— oneindiatelugu (@oneindiatelugu) April 15, 2022