తిరుపతి లడ్డూ పేరుతో ఛీటింగ్, వెబ్ సైట్ బ్లాక్, కేసు..
తిరుపతి లడ్డూ అంటే అందరికీ ప్రీతి. ఎవరైనా సరే శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నామని చెబితే చాలు.. లడ్డూ మరవొద్దు అని చెబుతుంటాం.. అలా తిరుపతి లడ్డూకు ఉన్న క్రేజీని క్యాష్ చేసుకుందామని అనుకొన్నారు కొందరు. తిరుపతి లడ్డూ పేరుతో చీట్ చేశారు. అదీ కూడా తిరుపతిలోనే కావడం విశేషం. ఆ వెబ్ సైట్ నకిలీదని తేలడంతో కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆ నకిలీ వెబ్సైట్ బ్లాక్ కూడా చేశారు.
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బాలాజీ ప్రసాదం.కామ్ పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలను ఇంటింటికీ అందజేస్తామని పేర్కొన్నారు. దేశంలోని ప్రతీ ప్రాంతానికి చెరవేస్తామని చెప్పారు. తమ ఆలయం పేరుతో లడ్డూలు విక్రయించే అంశం తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆ వైబ్సైట్ను బ్లాక్ కూడా చేశారు.
సాధారణంగా తిరుపతి లడ్డూ అంటే అందరికీ క్రేజీ ఉంటుంది. దీనిని క్యాష్ చేసుకుందామని ప్రయత్నించారు. తిరుపతి లడ్డూ రూ.50కి.. 10 కోట్ల పీసులను ఏడాదికి విక్రయిస్తుంటారు. అంతలా డిమాండ్ ఉన్న లడ్డూల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించారు. టీటీడీ ఫిర్యాదుతో వెబ్ సైట్ బ్లాక్ చేశారు. కానీ ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.