దిశ స్ఫూర్తితో దివ్య కేసులో ఏడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం : ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్
ఏపీలోని విజయవాడలో నిన్న జరిగిన దివ్య తేజస్విని హత్యపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం చాలా బాధాకరమైన ఘటనగా ఆయన పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇదే సమయంలో ఇటువంటి దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేశారు.
దిశ స్ఫూర్తిగా 7 రోజుల్లో ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సిపి స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆయన వెల్లడించారు . చిన్నారులపై, మహిళలపై దాడులకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీస్ శాఖ ఉపేక్షించదని పేర్కొన్న ఏపీ డీజీపీ సమాజంలో జరుగుతున్న ఇటువంటి వింత పోకడలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని స్పష్టం చేశారు.

క్రీస్తురాజపురానికి చెందిన దివ్య తేజస్విని అనే ఇంజనీరింగ్ విద్యార్థినిని నాగేంద్ర అనే యువకుడు గురువారం కత్తితో గొంతు కోసి హత్య చేశారని, ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలుస్తుంది.
అయితే ఈ కేసులో తాజాగా ఒక కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది . తాను దివ్య గొంతు కోయ లేదని, తామిద్దరూ ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ఎవరి గొంతు వాళ్లు కోసుకున్నామని నాగేంద్ర చెప్తున్నాడు. తనకు దివ్యకు పెళ్లయిందని తమ పెళ్లి ఇంట్లో పెద్దలు అంగీకరించని కారణంగా దివ్య, తను చనిపోదామనుకుని ఎవరి గొంతు వాళ్ళు కోసుకున్నాం అంటూ నాగేంద్ర వాంగ్మూలం ఇచ్చారు. రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును త్వరితగతిన ఛేదించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.
Recommended Video
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications