విజయవాడలో జోరుగా పోలింగ్- పడమటలంకలో ఓటేసిన పవన్ కళ్యాణ్
విజయవాడలో కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరంలో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.
విజయవాడలోని పటమటలంక పోలింగ్ బూత్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పడమటలో నివాసం ఉంటున్న పవన్కు ఎన్నికల అధికారులు ఇక్కడే ఓటు కేటాయించారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పవన్ ఓటేయడం ఇదే తొలిసారి. ఓటేసేందుకు పడమటలంకలో పోలింగ్ కేంద్రానికి పవన్ వస్తారన్న సమాచారంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. పవన్ రాగానే భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాసేపు హడావిడి నెలకొంది.

విజయవాడ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహిళలు, వికలాంగులు కూడా పోలింగ్ కేంద్రాలకు ఉదయమే తరలివచ్చారు. దీంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ఇరుపార్టీలకు చావోరేవోలా మారిపోయాయి. దీంతో ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
విజయవాడలో ఓటువేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
— JanaSena Party (@JanaSenaParty) March 10, 2021
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంక, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 4లో పవన్ కళ్యాణ్ గారు ఓటు వేశారు. pic.twitter.com/KQOQNnOE2c
విజయవాడలో జోరుగా పోలింగ్- పడమటలంకలో ఓటేసిన పవన్ కళ్యాణ్#andhrapradesh #Pawanakalyan #APMunicipalElections2021 pic.twitter.com/aVT6h0ZoB3
— oneindiatelugu (@oneindiatelugu) March 10, 2021
విజయవాడలో జోరుగా పోలింగ్- పడమటలంకలో ఓటేసిన పవన్ కళ్యాణ్#andhrapradesh #Pawanakalyan #APMunicipalElections2021 pic.twitter.com/DOi3RWKUiy
— oneindiatelugu (@oneindiatelugu) March 10, 2021












Click it and Unblock the Notifications