ఆయేషా మీరా హత్య కేసులో కొత్త ట్విస్ట్: కోనేరు సతీష్ను విచారించిన సీబీఐ
విజయవాడ: ఆయేషా మీరా కేసులో సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాఫ్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సతీష్తో పాటు అతని మిత్రులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో సీఐడీ సతీష్కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయేషా హత్య కేసులో మృతురాలి కుటుంబ సభ్యులు సతీష్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కోనేరు సతీష్ను సీబీఐ అధికారులు విచారించడం కీలక పరిణామం అని చెప్పవచ్చు.

కోనేరు సతీష్ను సీబీఐ అధికారులు ఆయన ఇంటి వద్దే ప్రశ్నిస్తున్నారు. ఆయేషా హత్య కేసులో తొలుత ఆరోపణలు ఎదుర్కొన్నది సతీష్. ఆయేషా మీరా చనిపోయిన హాస్టల్ వార్డెన్కు, కోనేరు సతీష్కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, తరచూ అతను హాస్టల్ వద్దకు వచ్చేవారని, తన స్నేహితులతో కూడా కలిసి వచ్చి హాస్టల్ కింది గదిలో మద్యం తాగి గొడవ చేసేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఆయేషా మీరాపై అతనే చంపేశాడనే ఆరోపణలు ఉన్నాయి. మృతురాలి తల్లి కూడా అతని పేరునే ప్రస్తావిస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు కోనేరు సతీష్ తాత కోనేరు రంగారావు డిప్యూటీ సీఎంగా ఉన్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో సతీష్ను కేసు నుంచి తప్పించేందుకు సాక్ష్యం లేకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు సీఐడీ... ఆయేషా మీరా హత్య కేసుకు, సతీష్కు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications