ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్ .. నూజివీడులో టెన్షన్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కానీ కరోనా వైరస్ మాత్రం చాప కింద నీరులా విస్తరిస్తోంది . కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఢిల్లీ మర్కజ్ తబ్లీఘీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారికి ఎక్కువగా కరోనా సోకటంతో ఆ చైన్ బ్రేక్ చెయ్యటానికి అధికార యంత్రాంగం ప్రయత్నం సాగిస్తుంది.కానీ ఇంకా ఆ చైన్ బ్రేక్ కాలేదేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .
ప్రజలంతా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కరోనా నియంత్రణకు ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. అయితే ఇదిలా ఉండగా కృష్ణా జిల్లాలోని నూజివీడులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్థారణ అయిందని వైద్యులు తెలిపారు. అయితే వీరికి కరోనా పాజిటివ్ ఎలా వచ్చింది. ఎవరి ద్వారా సోకింది. ఇంకా ఎవరైనా వీళ్ళలో తబ్లీఘీ జమాత్ కు వెళ్ళిన వారు ఉన్నారా ? అన్న కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు .

కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి నూజివీడు వెళ్లిందా! అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వెలుగు చూసిన సంఘటనలతో , పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఈ అనుమానం మొదలైంది. ఇప్పటిదాకా నూజివీడు పట్టణానికి పరిమితమైన కేసులు ఇప్పుడు గ్రామాలకు పాకడం ఆందోళనకరంగా మారింది. ఒకరి నుండి ఒకరికి ప్రైమరీ కాంటాక్ట్ కూడా తెలీకుండా కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో నమోదవుతున్న కేసులు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. నూజివీడు వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications