వైసీపీ నేతలు ఆంబోతులు .. జగన్ ఫ్యామిలీ రాజధానిలో పాదయాత్ర చేయగలరా ? దేవినేని ఉమా ఫైర్
ఏపీలో రాజధానిపై కొనసాగుతున్న రగడ ఇంకా ఉధృతంగానే కొనసాగుతుంది. రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు ఆగటం లేదు. ఇక రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ పోరాటం సాగిస్తుంది .అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల 24 గంటల దీక్ష చేశారు. వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

జగన్, కుటుంబ సభ్యులు రాజధానిలో పాదయాత్ర చేయగలరా అని ప్రశ్న
రాజధానిపై ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలుపుతూ దేవినేని వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలురాజధాని అమరావతి విషయంలో నోటికి వచ్చినట్టు ఆంబోతుల్లా మాట్లాడుతున్నారని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత కుటుంబంతో కలిసి రాజధానిలో పర్యటిస్తే విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు దేవినేని ఉమా . ఇక జగన్, కుటుంబ సభ్యులు రాజధానిలో పాదయాత్ర చేయగలరా? అని ప్రశ్నించారు.

ఇన్సైడర్ ట్రేడింగ్ కోసమే విశాఖ రాజధాని అని ఆరోపణలు
విశాఖను రాజధాని చేయాలని ఎవరూ అడగలేదని పేర్కొన్న ఆయన అమరావతిని అందరి ఆమోదంతోనే నిర్ణయించారని అప్పుడు కూడా వైసీపీ ఉందికదా అని ప్రశ్నించారు. అమరావతిని మార్చాల్సిన అవసరం ఏం వచ్చింది? అంటూ నిలదీశారు .ఉద్యమం చేసేవారిని పెయిడ్ ఆర్టిస్టులు అనడానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. విశాఖలో వేలాది ఎకరాలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. కేవలం ఇన్సైడర్ ట్రేడింగ్ కోసమే విశాఖను రాజధాని చేస్తున్నారని ఆరోపించారు.

విశాఖ భూదందాలపై సీబీఐ విచారణ జరపాలని సవాల్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భూదందాలకు పాల్పడుతున్నారని, సీఎం జగన్కి ధైర్యం ఉంటే విశాఖ భూదందాలపై సీబీఐ విచారణ జరపాలని దేవినేని ఉమా సవాల్ చేశారు. విశాఖ భూదందాలో ముఖ్యమంత్రికి సహకరించిన అధికారులు జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. వైసీపీ నేతలు ఏసీబీని అడ్డుపెట్టుకుని ఉద్యోగ సంఘాల నేతల్ని బెదిరిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం తప్పక చెప్తారని దేవినేని హెచ్చరించారు .
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications