జగన్ నిర్లక్షం ఖరీదు .. ప్రజల ప్రాణాలు : దేవినేని ఉమా ఫైర్
ఏపీలో కరోనా కేసులు పెరగటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు . కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దేవినేని ఉమా పేర్కొన్నారు. జగన్ నిర్లిప్తత ప్రజలను ప్రమాదంలో పడేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .
సీఎం జగన్ కు ఈ సమయంలో కూడా రాజకీయాలే ప్రధానంగా మారాయని మండిపడ్డారు.ప్రభుత్వ చేతగాని తనం వల్ల ఐదు కోట్ల మంది ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ ప్రయత్నం చెయ్యటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, కోర్టులంటే ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని దేవినేని ఉమా దుయ్యబట్టారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్న ఉమా అధికారులపై సీఎం జగన్ తానూ అనుకున్నది జరగాలని తీవ్ర ఒత్తిడి పెపెడుతున్నారని వ్యాఖ్యానించారు . రెడ్జోన్లో ఉన్న అధికారులను విధులకు రమ్మంటున్నారని, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వ నిర్ణయాన్ని దేవినేని ఉమ తప్పు పట్టారు .

ఇక ప్రభుత్వం అనవసరమైన వాటికి నిధులను కేటాయిస్తూ అవసరమైన వాటిపై నిర్లిప్త ధోరణి కొనసాగిస్తుందని ఆయన అన్నారు . పెన్షనర్లకు 50శాతం జీతాలు కట్ చేశారని, ప్రభుత్వ సలహాదారులకు మాత్రం కోట్లు విడుదల చేస్తున్నారని ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు దేవినేని ఉమా . విశాఖలో పాజిటివ్లు వస్తే అది బయటకు రానివ్వటం లేదని పేర్కొన్న ఆయన విశాఖలో పెరిగిన కేసులను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపేస్తున్నారని నిప్పులు చెరిగారు.
విశాఖకు రాజధానిని తరలించాలని చూస్తున్నారని అందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఇక గుంటూరు , కృష్ణా జిల్లాలలో కేసులు పెరిగాయని చెప్పి రాజధాని ఉద్యమాన్ని అణచివేసే పనిలో ఉన్నారని అన్నారు . సీఎం జగన్ తన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దేవినేని ఫైర్ అయ్యారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా అధికారులను పనిచేయిస్తే ఈ పరిస్థితి వచ్చేదా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications