విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా కల్లోలం- 27 మందికి ఖైదీలు, 10 మంది సిబ్బందికీ..

|
Google Oneindia TeluguNews

విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకడంతో ఇప్పటికే పలువురు ఖైదీలు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో జైల్లో శిక్ష అనుభవిస్తున్న మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్ చనిపోయాడు. కరోనా పరీక్ష నిర్వహిస్తే వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జైల్లో మిగిలిన ఖైదీలతో పాటు సిబ్బందికీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో పలువురు వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది.

27 prisoners and 10 other staff tested covid 19 positive in visakha central jail

విశాఖ కేంద్ర కారాగారంలో ఇప్పటివరకూ 27 మంది ఖైదీలు, 10 మంది సిబ్బంది కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. తాజాగా అధికారులు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ విషయం తేలింది. ఇందులో తీవ్రతను బట్టి బాధితులను క్వారంటైన్ సెంటర్లకు పంపుతున్నారు. పలువురికి అక్కడే ఉంచి హోం క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నారు. కరోనా సోకిన ఉద్యోగులకు సెలవులు ఇచ్చి హోం క్వారంటైన్ లో ఉండేలా ఆదేశాలు ఇస్తున్నారు. జైల్లో మిగిలిన వారికి కూడా త్వరలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
coronavirus spread continues in visakhapatnam central prison as 27 prisoners and 10 more staff tested positive recently. after moddu srinus' killer om prakash died with covid 19, officials hold tests to all the prisoners and staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X