ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా- వైజాగ్ లో సంచలనం- ఆందోళనలో డాక్టర్లు..
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ పేరు వింటేనే ఇప్పుడంతా భయపడిపోతున్నారు. ఒకసారి కరోనా అంటుకుంటే దాని నుంచి బయటపడే సరికి తలప్రాణం తోకకు వచ్చినంత పని అవుతోంది. కరోనాతో పోరాటం చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. అలాంటి ఒక కుటుంబంలో ఒకరి తరువాత ఒకరికి కరోనా వస్తే ఇంకెలా ఉంటుంది. అలా వచ్చిన వాళ్లలో రెండోసారి కూడా కరోనా సోకితే ఇంకెలా ఉంటుంది. బాబోయ్ దాన్ని తలచుకుంటేనే భయంకరంగా ఉంటుంది కదా.
కరోనా ముందు లేచిపోయి..బతకలేక తిరిగొచ్చారు..ఇంతలో అలా జరిగిపోయింది..
విశాఖలోని ఓ కుటుంబంలో నిజంగా ఇలానే జరిగింది. విశాఖలో ఓ కుటుంబంలో 8 మంది సభ్యులున్నారు. వీరిలో మొదట ముంబై నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి ఏప్రిల్ 1 వ తేదీన కరోనా సోకింది. కాగా, కరోనాకు చికిత్స తీసుకోవడంతో నయమైంది. దీంతో ఇంటికి వచ్చాడు. ఆ తరువాత ఇంట్లో అందరికి కరోనా సోకింది. ఆ తరువాత మరలా మొదట కరోనా సోకిన వ్యక్తికి తిరిగి కరోనా రావడంతో వైద్య సిబ్బంది షాక్ అయ్యారు.
Recommended Video
ఒకేసారి వచ్చిన వ్యక్తిలో వైరస్ ను అడ్డుకోగలిగే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని, అవి కరోనాను ఎటాక్ చేసే శక్తిని కలిగి ఉంటాయని వైద్యులు చెప్తుండగా, కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని రోజులకే తిరిగి రెండోసారి కరోనా సోకడంతో వైద్యులతోపాటు అటు వైజాగ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.