ఆర్కే బీచ్ లో విగ్రహాల తొలగింపుపై నిరసన .. మళ్ళీ విగ్రహాలు ఏర్పాటు చెయ్యాలన్న సినీ దర్శకుల సంఘం
విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో విగ్రహాలను తొలగించారు జీవీఎంసి అధికారులు . విగ్రహాలను అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని , విగ్రహాల ఏర్పాటు వల్ల స్థానికంగా ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని చేసిన ఆందోళన ఫలితంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల విగ్రహాల తొలగింపు చేసింది జీవీఎంసి .
ఆర్కే
బీచ్
లో
విగ్రహాల
తొలగింపు..
అసలు
అభ్యంతరం
హరికృష్ణ
విగ్రహం
వల్లేనట..
విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో సోమవారం అర్థరాత్రి మూడు విగ్రహాలను జీవిఎంసి అధికారులు కూల్చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు, ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావుతో పాటు తెలుగుదేశం మాజీ పార్లమెంటు సభ్యుడు హరికృష్ణ విగ్రహాలను తొలగించారు . అయితే సినీ ప్రముఖుల విగ్రహాలను తొలగించటంపై ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం ఆందోళనకు దిగింది.
సినీ ప్రముఖులైన అక్కినేని నాగేశ్వరరావు , దాసరి నారాయణ రావు ,హరికృష్ణ విగ్రహాలు తిరిగి ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేసింది. సినీ పరిశ్రమకు విశేషమైన సేవలందించిన వీరి విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వర రావు, హరి కృష్ణలు ముగ్గురూ కూడా సినీ, సామాజిక రంగాల్లో విశేషంగా కృషి చేసినవారని వారి విగ్రహాలు తిరిగి ఏర్పాటు చెయ్యకుంటే ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుందని వారన్నారు.