జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ-రుషికొండ కమిటీలో మీ అధికారులొద్దన్న హైకోర్టు- రఘురామ వాజ్యంలో
విశాఖపట్నంలోని రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా జరిగిన తవ్వకాలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీని నియమించాలని హైకోర్టు గతంలో ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఏపీ ప్రభుత్వం కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని నియమించింది. దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
రుషికొండ తవ్వకాల వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో రుషికొండపై త్రవ్వకాల మీద విచారణకై ఐదుగురు కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి విచారణ కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించారంటూ పిటిషనర్ రఘురామకృష్ణంరాజు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. తమ ఆదేశాల మేరకు ఐదుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులను విచారణలో నియమించకుండా అందులో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 21వ తేది నాటికి ఐదుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులను విచారణ కమిటీలో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తరువాత ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 21వ తేదికి వాయిదా వేసింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications