శిరోముండనం కేసు .. నూతన్ నాయుడిపై మరిన్ని కేసులు .. రౌడీ షీట్ తెరిచే ఛాన్స్
శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన నూతన్ నాయుడుపై మరిన్ని కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమైంది. దళిత యువకుడికి తన ఇంట్లో శిరోముండనం చేయించిన ఘటనలో నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటుగా ఆ ఘటనలో ఉన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే కేసు విషయంలో నూతన్ నాయుడును కూడా అరెస్ట్ చేసిన పోలీసులు శిరోముండనం కేసుకు సంబంధించి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

నూతన్ నాయుడిపై పలు స్టేషన్ లలో చీటింగ్ కేసులు
రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ పేరును దుర్వినియోగం చేసిన మోసానికి పాల్పడినట్లుగా గుర్తించిన వ్యవహారంలో నూతన్ నాయుడు పై ఇప్పటివరకు విశాఖ నగరంలోని పెందుర్తి, కంచరపాలెం, గాజువాక ,మహారాణిపేట స్టేషన్లలో 8 కేసులు నమోదయ్యాయి.
నూతన్ నాయుడు వేరొక సెల్ ఫోన్ నెంబర్ తో పీవీ రమేష్ పేరు ను ఉపయోగించి ఎంత మందిని మోసం చేసి ఉంటారనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నూతన్ నాయుడు బారినపడి మోసపోయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. నూతన్ నాయుడు ఇప్పటి వరకు 30 మంది అధికారులతో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు.

మొబైల్ ఫోన్ కాల్స్ డేటా పరిశీలన .. రౌడీ షీట్ తెరిచే ఆలోచన
వారందరి నుంచి ఫిర్యాదులు తీసుకుని నూతన్ నాయుడు పై కేసులు నమోదు చేయనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నూతన్ నాయుడుకు సంబంధించి ఆయన వినియోగించిన మొబైల్ నెంబర్ ఫోన్ కాల్స్ జాబితాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆయనపై ఎనిమిది కేసులు నమోదు కావడంతో ఆయన పై రౌడీషీట్ తెరిచే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇక మరో మారు కోర్టు అనుమతిస్తే నూతన్ నాయుడు భార్య మధుప్రియ తో పాటు మరో ఐదుగురిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు .

మరో మారు విచారణకు కోర్టు అనుమతి కోరిన పోలీసులు
దీని కోసం కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే మరోమారు విచారించి ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
మొత్తానికి ఏపీలో సంచలనం సృష్టించిన దళిత యువకుడి శిరోముండనం కేసులో ప్రధాన పాత్రధారి అయిన నూతన్ నాయుడు భార్యతో పాటుగా, ఆ రోజు ఘటన సమయంలో ఉన్న వారందరినీ, ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించిన నూతన్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Recommended Video

శిరోముండనం కేసులో కొత్త కోణాలు
ఏపీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉడిపి నుండి ముంబై పారిపోతున్న నూతన్ నాయుడు ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న క్రమంలో ఈ కేసులో మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
నూతన్ నాయుడు చేసిన మరిన్ని మోసాల గుట్టు రట్టవుతుంది .
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications