హైకోర్టు ఆదేశాల బేఖాతర్-మాన్సాస్ ఉద్యోగులకు అందని జీతాలు-నిరసనల పర్వం
విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులకు జీతాల వ్యవహారంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా వారి వెతలు మాత్రం తీరలేదు. ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడంతో వారు ఇవాళ కూడా తమ నిరసనలు కొనసాగించారు. మాన్సాస్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు ఆదేశాలను ఈవో పాటించకపోవడమే ఇందుకు కారణం.
మాన్సాస్ ఉద్యోగుల జీతాలు నిలిపేస్తూ ఈవో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దీంతో ఉద్యోగులు ఛైర్మన్ అశోక్ గజపతిరాజుకు మొరపెట్టుకున్నారు. అయినా వారి వెతలు తీరకపోగా మరింత ఎక్కువయ్యాయి. ఉద్యోగులతో పాటు అశోక్ పైనా ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అయితే మాన్సాస్ ఉద్యోగుల జీతాలపై అశోక్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈవో తీరును తీవ్రంగా ఆక్షేపించింది. అయినా పరిస్ధితిలో ఎలాంటి మార్పూ లేదు.

హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు ఇంకా అందకపోవడంతో వారు నిరనసలు చేపట్టారు. తమకు జీతాలు చెల్లించాలంటూ విజయనగరంలో మాన్సస్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి.. జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన అధికారులు అమలుచేయక పోవటం పై ఉద్యోగులు మండిపడుతున్నారు... ఎమ్ ఆర్ అటానమాస్ కాలేజ్ వద్ద మానవహారం నిర్వహించి ఉద్యోగులు తమ నిరసన వ్యక్తం చేశారు.. మాన్సస్ జెఏసీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి పలు కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.
హైకోర్టు ఆదేశాల బేఖాతర్-మాన్సాస్ ఉద్యోగులకు అందని జీతాలు-నిరసనల పర్వం#mansas #vizianagram, pic.twitter.com/bXXZ7YcxEM
— oneindiatelugu (@oneindiatelugu) July 29, 2021
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications