తుపాకీతో వీరంగం.. గోపాలస్వామి గుడి వద్ద ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ హల్ చల్.. బెంబేలెత్తిన జనం
అసలే ఖాకీ.. ఆపై మద్యం సేవించి ఉన్నాడు. ఇంకేముంది నాలుగో సింహం మాట వినడం లేదు. చేతిలో తుపాకీ పట్టుకొని బీభత్సం సృష్టించాడు. కానీ పక్కనే ఉన్న జనం మాత్రం భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ ఫైర్ చేస్తారని భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనాస్థలానికి వాయువేగంతో ఖాకీలు చేరుకున్నారు.
వరంగల్ గోపాలస్వామి గుడి దగ్గర ఏఆర్ హెడ్కానిస్టేబుల్ హల్చల్ సృష్టించారు. ప్రధాన రహదారిపై తుపాకీతో బాలప్రసాద్ వీరంగం సృష్టించారు. ఎంజీఎంలో ఖైదీలకు సెక్యూరిటీ కోసం బాలప్రసాద్ వచ్చాడు. అలా వచ్చి తుపాకీ పట్టుకొని బీభత్సం చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హెడ్కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. బాలప్రసాదర్ వద్ద గల తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
బాల ప్రసాద్ తాగిన మైకంలో తుపాకీ చేత పట్టుకొని రోడ్డుపై వీరంగం సృష్టించాడని తెలుస్తోంది. తుపాకీ పట్టుకుని రోడ్డుపై తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. మట్వాడ పోలీసులు రంగంలోకి దిగి.. తుపాకీ స్వాధీనం చేసుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాకీ పట్టుకొని దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించడంతో భయపడ్డామని చెప్పారు. కాసేపు పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించాయని తెలిపారు. చివరికీ పోలీసులు వచ్చి గన్ తీసుకోవడంతో.. ప్రాణం వచ్చినట్టు అనిపించిందని వివరించారు.