వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఇళయరాజా పాటల పందిరి

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
కాలిఫోర్నియా: ప్రముఖ సినీ సంగీత విధ్వాంసుడు ఇళయరాజా పాటలు అమెరికాలో మార్మోగాయి. ఇళయరాజా గౌరవార్థం స్థానిక సన్నీవేల్‌ హిందూ దేవాలయంలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఉత్యాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ నేపథ్య గాయకుడు మల్లికార్జున్‌, నైటింగేల్‌ సిస్టర్స్‌ శిల్ప ఉప్పులూరి, దీపిక ఉప్పులూరి, మెలోడీ గాయనిగా పేరు పొందిన శారద ఆకునూరి తదితరులు స్థానిక గాయకులైన సుధాశాస్త్రి, వంశీ నాదెళ్ల, నారాయణ రాజులతో కలిసి ఆలపించిన ఇళయరాజా పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి.

ప్రముఖ శాక్సోఫోనిస్ట్‌ రమేష్‌ మరాజ్‌ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాత పాటలకు సముచిత గౌరవ స్థానం కల్పించాలనే ఒక సత్సంకల్పంతో సంగీత విభావరి కార్యక్రమం మొదలు పెట్టామని చిమటమ్యూజిక్‌.కామ్‌ అధినేత శ్రీనివాసరావు చిమట వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతంమవడానికి సహాయపడిన స్పాన్సర్లకు, వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని సమన్వయకర్తలు శ్రీనివాస్‌ చిమట, రమణ ఈడూరి, వంశీ నాదెళ్ల, ప్రసాద్‌ మంగినలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాటల పోటీలో విజేతలైన అమృత తుర్లపాటి, శ్రియ అరవీటి శ్రేయ బుద్ధవరపు, నవ్యమైత్రి కొండా, పూజిత దశిక, నిత్య కస్తూరి, కార్తీక్‌ నూలి, శైలజ భాగవతుల, శ్రీనివాస్‌ వారణాసిలకు బహుమతలు అందజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X