న్యూజెర్సీలో శ్రీనివాస కళ్యాణం
భక్తిని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి టిటిడి భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ కొన్నేళ్లుగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తే శాంతి, సంపద సమకూరుతాయనే విశ్వాసం ఉంది. తన ప్రాజెక్టులో భాగంగా టిటిడి మొదట భాజరతదేశంలోని శ్రీ గురువయూరప్పన్ ఆలయంలో 2010లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించింది. తిరుమలకు వెలుపల నిర్వహించిన తొలి శ్రీనివాస కళ్యాణం ఇదే.
ఆ కళ్యాణాన్ని కన్నులారా వీక్షించడానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఆ కార్యక్రమం విజయవమైన తర్వాత టిటిడి ఆలయానికి శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి ఉత్సవ మూర్తులను బహూకరించింది.
శ్రీనివాసుడి కళ్యాణ నిర్వహణకు మే 5వ తేదీన న్యూజెర్సీ ఆలయానికి వేద పండితులు, అర్చకులు విచ్చేస్తున్నారు. అది శనివారం కూడా అవుతోంది. ఈ కళ్యాణోత్సవానికి టిటిడి చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇతర అధికారులు వస్తారని ఆశిస్తున్నట్లు డాక్టర్ మణి చెప్పారు.
కేవలం శ్రీవారి కళ్యాణం మాత్రమే కాకుండా తిరుమలలో చేసే శ్రీవారి సేవలు కూడా చేస్తారు. ఆ కార్యక్రమం మే 5వ తేదీ ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తోమల సేవ, అర్చన, కళ్యాణం జరుగుతాయి.