వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యాపిల్లల్ని చంపి ఇండియన్ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

 Sikh family found dead in US
వాషింగ్టన్: భారత దేశానికి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను, భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని అట్లాంటాలో వెలుగు చూసింది. భారతదేశానికి చెందిన సిక్కు శివిందర్ సింగ్ గ్రోవెర్ (52) అట్లాంటాలో ఉంటున్నారు.

గ్రోవెర్‌కు భార్య దమన్‌జిత్ కౌర్ (47), పిల్లలు సర్తాజ్ (12), గుర్‌తేజ్ (5) ఉన్నారు. సోమవారంనాడు గ్రోవేర్ ఇద్దరు కుమారులను, భార్యను హత్య చేసి తాను ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు కారణాలేమిటనేది తెలియదు.

మిచిగన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న శివిందర్ ఇటీవలే అట్లాంటాకు వెళ్లినట్లు పోలీసుసు చెప్పారు. పిల్లల గొంతులపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్య శరీరంపై కూడా గాయాలున్నట్లు చెబుతున్నారు.

ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. శివిందర్ ఓ టెక్నాలజీ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

English summary

 Four members of a Sikh family, including two minor children, have died in Atlanta in the US state of Georgia under mysterious circumstances with police terming it as a "murder-suicide".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X