26వ అంతస్తు నుంచి పడి భారత సంతతి వ్యక్తి మృతి

ఆ భవనంలో 36 అంతస్థులున్నాయి. మృతుడు మెల్బోర్న్లోని పంజాబ్ డ్యాన్స్ గ్రూపునకు చెందినవాడు. గత రాత్రి సంధుతో, అతని మిత్రులతో డ్రింక్స్కోసం కలిసిన నైట్ క్లబ్ యజమాని గ్యారీ వోహ్రా మాటలను ఉటంకిస్తూ ది ఏజే న్యూస్ పేపర్ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.
రెహ్మత్ బాల్కనీ రెయిలింగ్పై కూర్చున్నాడని, ఆ సమయంలో కింద పడిపోయాడని తాను విన్నట్లు వోహ్రా చెప్పారు. అయితే, వ్యక్తి మృతిపై దర్యాప్తు చేస్తున్నామని, అపార్టుమెంటులో పలువురిని అడిగి విషయాలు తెలుసుకుంటున్నామని పోలీసులు చెప్పారు.
రెహ్మత్ సంధు మృతిపై అనుమానాలేమీ లేవని, న్యాయమూర్తి కోసం తాము ఓ నివేదికను తయారు చేస్తామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications