ఢిల్లీ ఎన్నికలు: కేజ్రీవాల్ పార్టీకి మద్దతు
న్యూయార్క్: త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి తమ మద్దతు తెలియజేస్తున్నట్లు లోక్ సత్తా పార్టీ అనుబంధ ఎన్నారై సంస్థ పీపుల్ ఫర్ లోక్ సత్తా (పిఎఫ్ఎల్) పేర్కొంది. లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించారని పిఎఫ్ఎల్ తెలిపింది.
తమ నేత జయప్రకాశ్ నారాయణ్ ఆదేశానుసారం ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలియజేయడంలో భాగంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టినట్లు పిఎప్ఎల్ పేర్కొంది. ఫోన్ కంపెయిన్స్, చర్చలు జరపడం ద్వారా తాము మద్దతు తెలియజేస్తున్నట్లు, ఇందుకోసం తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఫిఎఫ్ఎల్ సభ్యులు తెలిపారు.

ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో తాము భాగస్వాములమవుతున్నట్లు, లోక్పాల్ బిల్లుకు మద్దతుగా అమెరికాలోని శాన్ డియాగో నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు సుమారు 240 కిలో మీటర్ల నడక ద్వారా దండి మార్చ్-2ను చేపట్టినట్లు పిఎఫ్ఎల్ సభ్యులు చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే, యోగా గురువు బాబా రాందేవ్ చేపట్టిన దీక్షలకు మద్దతుగా తాము కూడా ఉపవాస దీక్షలు చేపట్టినట్లు తెలిపారు.
పిఎఫ్ఎల్ సభ్యత్వ ఉపాధ్యక్షుడు కృష్ణ బురుగుపల్లి మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ సత్తా పార్టీల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ భారతదేశంలోని ఇతర పార్టీలకు ఈ రెండు పార్టీలు ప్రత్యామ్నాయంగా ఉన్నాయని తెలిపారు. ఈ రెండు పార్టీలకు దేశంలోని యువత నుంచి భారీ మద్దతు లభిస్తోందని చెప్పారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విద్యావంతులు, మేధువులైన ఓటర్లు తమకు మేలు చేసే పార్టీకి మద్దతు పలుకుతారని కృష్ణ అన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications