ప్రవాస భారత ప్రొఫెసర్కు దక్కిన అరుదైన గౌరవం
వాషింగ్టన్: అమెరికాలో స్ధిరపడిన భారతీయ ప్రొఫెసర్ థామస్ కైలత్ (79)క అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మక ‘యుఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్‘కు ఆయన్ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎంపికయ్యారు.
శాస్త్ర, సాంకేతిక పరిశోధనా రంగాల్లో కైలత్ చేసిన సేవలకు గుర్తింపుగా కైలత్తో పాటు మొత్తం పది మందిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో వైట్ హౌజ్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
థామస్ కైలత్ మళయాలం మాట్లాడే సిరియూ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. 1956లో పూణె వర్సిటీ నుంచి పట్టా పొందారు. 1961లో అమెరికాలోని మస్సాచుసెట్స్ వర్సిటీ నుంచి మాస్టర్స్, డాక్టరేట్ డిగ్రీలు అందుకున్నారు.
వీటితో పాటు భారత ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక పరిశోధనా రంగాల్లో కైలత్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.