దారుణం: బాలికపై ట్రైనీ ఎస్ఐ అత్యాచారయత్నం

ఆ తర్వాత బాధితురాలు నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చౌటుప్పల్ పోలీసు స్టేషన్కు చెందిన భరత్ నాయుడు రెండు నెలల క్రితం మైనర్ బాలికతో స్నేహం కుదుర్చుకున్నాడు. చిట్యాలలో నివసించే ఆ మైనర్ బాలికను ఆదివారంనాడు నల్లగొండలోని తన ఇంటికి భరత్ నాయుడు అహ్వానించాడని పోలీసులు చెప్పారు.
ఇంటికి వచ్చిన బాలికపై అతను అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా కార్మికులు కొందరు ఇంటి తలుపులు కొట్టారు. దాంతో అతను బయటకు వచ్చాడు. వారు వెళ్లిపోయిన తర్వాత మరోసారి బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే, తెలివిగా బాలిక అతని నుంచి తప్పించుకుంది.
భరత్ నాయుడి సస్పెన్షన్కు పోలీసు అధికారులు సిఫార్సు చేశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications