IPL 20226: ముంబై ఓడిపోతున్న వేళ ఆకాష్ అంబానీ ఫ్రస్ట్రేషన్ - వీడియో వైరల్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోర పరాజయం పాలైంది. ఏకంగా 104 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే తమ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ముంబై ప్లేయర్ల ప్రదర్శన ఈసారి జట్టు యాజమాన్యానికి సైతం ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా మ్యాచ్ చివర్లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆరంభం నుంచీ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అఫసోపాలు పడ్డారు. వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. అలాగని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ అంత అద్బుతంగా ఉందా అంటే అదేమీ లేదు. సాధారణ బౌలర్లకు సైతం ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఇదంతా చూస్తున్న ముంబై ఇండియన్స్ యాజమాని ఆకాష్ అంబానీకి చిర్రెత్తుకొచ్చింది. దీంతో మ్యాచ్ ముగియకముందే ఆకాష్ తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించారు.

There is absolutely nothing going right for Mumbai Indians right now. Just look at Akash Ambani walking off mid-game and he walked right in front of the dugout and didn’t even look at the players. He literally asked the fans to leave the stadium as well. The lack of unity is… pic.twitter.com/8nplMjRYLN
— OldMonkOfCricket (@OldMonkOfCric) April 24, 2026
ముంబై ఇండియన్స్ ఆలౌట్ కావడానికి ముందే ఆకాష్ అంబానీ తన సీట్లో నుంచి లేచి ఇంటికి బయలుదేరారు. అంతే కాదు ముంబై ఆటతీరుపై తన విసుగు అంతా ప్రదర్శించారు. విసురుగా నడుస్తూ మధ్యలో మ్యాచ్ చూస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ను సైతం ఇంకే చూస్తున్నారు, ఇల చాల్లెండి అన్నట్లుగా సైగలు చేశారు. దీంతో వారు కూడా కేకలు పెట్టడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. అప్పుడే ఏమైంది.. సినిమా ఇంకా చాలా ఉందని సెటైర్లు వేస్తున్నారు.














Click it and Unblock the Notifications