Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విన్నర్లు వర్సెస్ రన్నరప్ లా? వరల్డ్ కప్ సూపర్ 8 ఫార్మాట్ పై విమర్శలు..!

భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ (t20 world cup 2026)ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ వివాదం, ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ వివాదం, ఇప్పుడు సూపర్ 8 ఫార్మాట్ వివాదం. ఈ టోర్నీలో సూపర్ 8 ఫార్మాట్ ను ఐసీసీ సెట్ చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ 8లో జట్లకు ముందుగానే సీడింగ్ ఇచ్చేయడం, ఆ సీడింగ్ ఇచ్చిన జట్లలో కొన్ని అసలు సూపర్ 8కు రాకపోవడం, వచ్చిన జట్లలో పోటీ కూడా విచిత్రంగా ఉండటం ఇందుకు కారణమవుతోంది.

ఈ వరల్డ్ కప్ లో ఆడిన మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించిన ఐసీసీ (icc) ప్రతీ గ్రూపులోనూ టాప్ 1, 2 పొజిషన్లలో నిలిచిన వారిని సూపర్ 8కు అర్హులుగా చేసింది. దీంతో ప్రతీ గ్రూపులోనూ పోటీ పడి టాప్ లో నిలిచిన జట్లతో పాటు రెండో స్ధానంలో నిలిచిన జట్లు కూడా సూపర్ 8కు అర్హత సాధించాయి. కానీ సూపర్ 8లో ముందుగానే ఎనిమిది జట్లకు ప్రీ సీడింగ్ పేరుతో అనధికార అర్హత ప్రకటించిన ఐసీసీ విమర్శలు ఎదుర్కొంది. ఇలా ప్రీడింగ్ ప్రకటించిన జట్లలో ఆస్ట్రేలియా సూపర్ 8కు చేరలేదు, దీని స్ధానంలో జింబాబ్వే అర్హత సాధించింది. ఈ విమర్శల నుంచి బయటపడేలోగా ఐసీసీకి మరో విమర్శ ఎదురైంది.

T20 World Cup Super 8 Format Under Fire Why Winners and Runners-Up Face Off Immediately

సూపర్ 8 లోనూ రెండు గ్రూపులు పెట్టింది. ఈ రెండు గ్రూపుల్లో మొదటి గ్రూపులో ఉన్న వారిని చూస్తే వారంతా గ్రూప్ స్టేజ్ లో తమ గ్రూపుల్లో టాప్ లో నిలిచి వారు. అంటే విన్నర్లన్న మాట. అలాగే సూపర్ 8 రెండో గ్రూపులో ఉన్న వారిని చూస్తే వారంతా గ్రూప్ స్టేజ్ లో తమ గ్రూపుల్లో రెండో స్ధానంలో నిలిచిన వారే. అంటే రన్నరప్ లు అన్నమాట. దీన్ని బట్టి చూస్తే గ్రూప్ స్టేజ్ లో విన్నర్లకూ, రన్నరప్ లకూ మధ్య ఆటోమేటిగ్గా సూపర్ 8 పోరు జరగబోతోందన్న మాట. ఇదే ఐసీసీపై విమర్శలకు కారణమవుతోంది.

T20 World Cup Super 8 Format Under Fire Why Winners and Runners-Up Face Off Immediately

ప్రస్తుతం సూపర్ 8 తొలి గ్రూపుకు అర్హత సాధించిన జట్లలో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. వీరంతా గ్రూప్ స్డేజ్ లో టాప్ 1 పొజిషన్ లో నిలిచిన వారే. అలాగే సూపర్ 8 రెండో గ్రూప్ లో పాకిస్తాన్, శ్రీలంక, న్యూజీలాండ్, ఇంగ్లండ్ ఉన్నాయి. వీరంతా గ్రూప్ స్డేజ్ లో రెండో స్ధానంలో నిలిచిన వారే. ఇప్పుడు సూపర్ 8లో ఉన్న రెండు గ్రూపుల్లో ప్రతీ గ్రూపులో ప్రతీ జట్టూ మిగిలిన మూడు జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఇందులో ఇద్దరు మాత్రమే సెమీస్ కు అర్హత సాధిస్తారు. అంటే సూపర్ 8 స్టేజి లోనే గ్రూపు స్టేజిలో విన్నర్లుగా నిలిచిన ఇద్దరు ఇంటిముఖం పట్టడం ఖాయం. అలాగే ఆతిధ్య శ్రీలంక సెమీస్ కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ ను తమ స్వదేశంలో కాకుండా భారత్ లో ఆడాల్సి రావడం కూడా విమర్శకు తావిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+