గుంటూరు పేలుడుకధేంటి!
వివాదస్పదంగా మారి కొంతమేర తన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసినమద్యపాన నిషేధం ఎత్తివేత వంటి సున్నితఅంశాలను కూడా ఈ పుస్తకంలో చంద్రబాబు లేవనెత్తడంవిశేషం. అక్రమ సారా వ్యాపారం అడ్డూ అదుపు లేకుండాపెరిగి పోవడం, దొంగసారాయి ప్రవహించడం,మాఫియా రంగ ప్రవేశం వంటి పరిణామాలవల్ల నిషేధం అర్థరహితంగా మారిందని అందువల్లేఎత్తివేయాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు.
ఐటి రంగాన్ని అతిగా నెత్తిన ఎత్తుకుంటున్నారన్నఅపవాదును తుడిచిపెట్టి బ్యాలెన్స్డ్ ఇమేజ్సంపాదించుకునే ప్రయత్నం కూడా ఈ పుస్తకంలోచంద్రబాబు చేసినట్టుగా కనిపిస్తున్నది.రాష్ట్రంలో దారిద్ర్యాన్ని సమూలంగా నిర్మూళించాలన్నదే తనద్యేయమని ఈ లక్ష్య సాధనకు ఐటిని తాను ఒకవ్యూహాత్మక సాధనంగా తీసుకున్నానని చంద్రబాబుపేర్కొన్నారు. జన్మభూమి, విజన్2020, ఐటి తో దారిద్ర్యం పైముప్పేటా పోరు సాగిస్తున్నానని ఆయన తెలిపారు. జన్మభూమి తనకు స్ఫూర్తి ప్రదాత కాగావిజన్ 2020 మార్గదర్శి అని ఐటి శక్తివంతమైనసాధనమని ఆయన వివరించారు.
తనకత్యంత యిష్టమైన సబ్జెక్ట్పేదరికం వర్సెస్ ప్రజాకర్షక విధానాలపై కూడాఆయన పుస్తకంలో తనదైన బాణీలో గట్టిచర్చనే జరిపారు. సబ్సిడీల కోత వల్ల ప్రజావ్యతిరేకత తప్పదని తనసహచరులు, సన్నిహితులు అనేకమంది తననుహెచ్చరించారని అయినప్పటికీ తాను అనుకున్న ప్రకారం పనులు చేసుకుంటూవెళ్లానని ఎన్నికల్లో ప్రజలు మళ్లీ పట్టంకట్టారంటే పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలుయిష్టపడుతారని స్పష్టంగా వెళ్లడయిందనిఆయన అన్నారు.
ప్లేయిన్ స్పీక్పుస్తకంలో ఎక్కడా నాయుడు వ్యక్తిగత విషయాలుఆయన రాజకీయ నేపథ్యం వంటి విషయాలు లేకపోవడం గమనార్హం. ఏ పరిస్థితుల్లోతెలుగుదేశం సంస్థపాక అధినేత ఎన్టీఆర్నుగద్దె దించి చంద్రబాబు అధికారంలోకిరావల్సివచ్చిందో కూడా పుస్తకంలో ఎక్కడాప్రస్తావించలేదు. అయితే పుస్తక సహ రచయిత సెవంతినైనన్ రాజకీయాల్లో చంద్రబాబుశరవేగంతో తారాపధంలోకి దూసుకుపోయిన వైనాన్ని క్లుప్తంగాప్రస్తావించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఏస్థాయిల్లో వుందో ప్రభుత్వం జరిపిన సర్వే వివరాలు కూడాపుస్తకంలో పొందుపర్చారు. నారావారి పల్లెలో జన్మించినచంద్రబాబు నాయిడు, రాజకీయాల్లో కష్టపడిపైకి వచ్చారు. సామాన్య రైతు కుటుంబానికిచెందిన నాయుడు 1978లో తొలిసారిగా అసెంబ్లీకిఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా గెలిచి మంత్రిపదవి కూడా దక్కించుకున్నారు. తన మామగారైన ఎన్టీఆర్ స్థాపించినతెలుగుదేశం పార్టీలో 1995 వరకు నెంబర్టూ గారాణించారు. ఆ తర్వాత పార్టీలో వచ్చిన తిరుగుబాటుతో ఎన్టీఆర్హయాం అంతరించి చంద్రబాబు శకం మొదలయింది.