హైదరాబాద్: ఉప ఎన్నికలుముగియడంతో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపైఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇంటాబయటాసమస్యలతో సతమవుతున్న ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు వాటికి విరుగుడు మంత్రివర్గవిస్తరణేనని భావిస్తున్నట్లు వినికిడి. విద్యుత్ ఛార్జీలపెంపుతో ప్రతిపక్షాలు బయటి నుంచి ముఖ్యమంత్రినిఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అదేసమయంలో ఇంటిపోరు రచ్చకెక్కే వాతావరణంఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలోమంత్రిపదవులు దక్కక లోలోపల కుమిలిపోతున్నసీనియర్లకు విద్యుత్ చార్జీల పెంపు పేరుతో చంద్రబాబుపై కుంపటి రాజేసేఅవకాశం చిక్కింది. ఇప్పటికే డిప్యూటి స్పీకర్కె. చంద్రశేఖరరావు చంద్రబాబుకు బహిరంగ లేఖరాయడం తలనొప్పిగా పరిణమించింది. మరో మాజీ మంత్రిబి. గోపాలకృష్ణారెడ్డి కూడా గొంతు విప్పారు. వారికి తోడు శాసనసభ్యులుమరికొందరు గళాలు విప్పుతారేమోననే ఆందోళనతెలుగుదేశం వర్గాల్లో స్పష్టంగాకనిపిస్తోంది.
బుల్లి కారు తయారీలో మైనర్ బాబు
హైటెక్ ముఖ్యమంత్రిచంద్రబాబు పుత్రుడు లోకేష్బాబు భవిష్యత్తును
అంచనా కట్టి బుల్లికారుకు రూపకల్పన చేశాడు.












Click it and Unblock the Notifications
