వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోకు మూడ్‌ మారిపోతేఏమైనా జరిగిపోవచ్చు, అందులోనూ రాజశేఖర్‌లాంటి హీరో అయితేమరీను! ఇంతకు ముందు ఒక చిత్రంలో నటుడినిమార్చేసే దాకా అంగీకరించని రాజశేఖర్‌ ఇప్పుడు ఏకంగాతాను నటిస్తున్న చిత్రం దర్శకుడినే మార్చేయడానికి నిర్మాతలపై ఒత్తిడి పెట్టాడని వినికిడి. అదీ,ముత్యాల సుబ్బయ్యలాంటి దర్శకుడిని రాజశేఖర్‌కాదన్నాడంటే పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చు.

By Staff
|
Google Oneindia TeluguNews

అసలు విషయానికి వస్తే, తమిళంలో సంచలనవిజయం సాధించిన వానతైపోలి చిత్రంహక్కులను రాజశేఖర్‌ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులోగణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించడానికి ఫైనాన్షియర్‌రమేష్‌, బెల్లంకొండ సురేష్‌ ముందుకు వచ్చారు.దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యను ఎంపికచేసి, భారీ స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడానిర్వహించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీ బాలాజీ ఆర్ట్‌క్రియేషన్‌ పతాకం మీద తలపెట్టిన చిత్రం షూటింగ్‌ పార్ట్‌పూర్తయింది. దీని రషెస్‌ చూసిన రాజశేఖర్‌కు మూడ్‌మారిందట. వెంటనే గణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంమీద ప్రారంభించిన చిత్రానికి దర్శకుడిని మార్చాలని రాజశేఖర్‌మనసుకు అనిపించింది. అంతే, నిర్మాతలురమేష్‌, సురేష్‌లకు చెప్పేశాడు. అయితే, ముత్యాలసుబ్బయ్యను తీసేసి ఏ దర్శకుడిని ఎంపికచేయాలనే మీమాంసలో పడ్డారు. ముత్యాలసుబ్బయ్య స్థాయికి తగ్గని డైరెక్టర్‌ కావాల్సి వచ్చింది. ఆలోచించగాచంటి, పెదరాయుడు సినిమాలకు దర్శకత్వంవహించిన రవిరాజా పినిశెట్టి పేరు తట్టింది. ఇప్పుడుముత్యాల సుబ్బయ్య స్థానంలో రవిరాజా పినిశెట్టి రాజశేఖర్‌ కొత్త చిత్రానికి దర్శకత్వంవహిస్తున్నట్లు వినికిడి.

కొసమెరుపుమేమిటంటే, రాజశేఖర్‌హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఒక్కడుచాలు అనే చిత్రనిర్మాణం జరుగుతోంది. ఏడాదిగాఇది నిర్మాణంలోనే వుంది. రేపు ఈ ఒక్కడు చాలుబాక్సాఫీసు వద్ద బోల్తా కొడితే మళ్లీ దర్శకుడినిమార్చాలని రాజశేఖర్‌ పట్టుబడుతాడేమోనని నిర్మాతలు భయపడుతున్నట్లుసినీరంగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X