బాబుపైమహారథి బాణం
హోంపేజి టాక్ ఆఫ్ టుడే చంద్రబాబు Thursday, April 15 2004
హైదరాబాద్:సినిమా రచయిత త్రిపురనేని మహారధిచంద్రబాబు నాయుడు నాయకత్వంలోనితెలుగుదేశం పార్టీని ఓడించమంటూ ఏకంగాఒక పుస్తకం రాసిపడేశారు. ఎన్టీఆర్మరోసారి మరణించారు అనే ఈ పుస్తకంలోఎన్టీఆర్, ఏఎన్నార్ లతో ప్రాంతీయ పార్టీ పెట్టించాలనిపందొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి జరిగినతెరవెనుక ప్రయత్నాలను వివరించారు.
నాదెండ్లభాస్కరరావు వెన్నుపోటు పొడవడంతోఎన్టీఆర్ తొలిసారి మరణించారని, ఆ తర్వాతనాలుగేళ్ళకు తెలుగుదేశం ఓడిపోయినప్పుడుఅవమానాలు భరించలేక ఎన్టీఆర్ రెండోసారిమరణించారని మహారధి రాశారు.తొంభై అయిదులో చంద్రబాబు నాయకత్వంలోకుటుంబసభ్యులంతా కుట్ర పన్ని అధికారంనుంచి దించినప్పుడు ఎన్టీఆర్ మూడోసారి మరణించారనిఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఎన్టీఆర్మరోసారి మరణిస్తారని త్రిపురనేనిమహారధి రాశారు. ఎనభై పేజీల ఈ పుస్తకంధర ముప్పై రూపాయలు.
- ఏంప్లాను బాబో
-
సైకిల్కు
అసమ్మతి
బ్రేక్లు