పీఆర్పీ టీవీ త్వరలో?

వైజాగ్ లో పార్టీ సమీక్షా సమావేశానికి వచ్చిన పరిశీలుకులు, ఆ పార్టీ ముఖ్య నేతలు మొత్తం మీడియా సరిగ్గా సహకరించకపోవటం వల్లే తమకీ స్ధితి వచ్చిందని వాపోయారు. ఉన్న ఒక్క మాటీవీ కూడా మాటవినే స్ధితిలో లేదని, న్యూస్ సైతం తీసేసిందని గోలపెడుతున్నారు. దాంతో ప్రజారాజ్యం పార్టీ ఒక సొంత టివి ఛానల్, పత్రికను ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆ పార్టీ నాయకుల ప్రసంగాలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
అలాగే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని తొక్కేయడానికి మీడియా యావత్తూ పనిచేసిందని వారు అంటున్నారు. ఎన్నికల్లో పరజాయంపాలైన తరువాత కూడా పిఆర్పీ ఖాళీ అయిపోతోందన్న కథనాలు ఆ ఛానెల్స్,పేపర్లులలో వస్తున్నాయన్నారు. ఇక చిరంజీవికి అత్యంత సన్నిహితంగా మెలికే కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబు కూడా ఈ అంశాలను పదేపదే ప్రస్తావించారు.
మీడియా దుష్ప్రచారం వలనే ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాలేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని అథిష్టానం తీవ్రంగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీకి ఒక సొంత ఛానల్, పత్రిక ఉంటే బాగుంటుందన్న నేతల అభిప్రాయాలకు అనుగుణంగానే అధిష్టానం నిర్ణయం తీసుకోనుందని ఆ పార్టీ అగ్రనేతలు అన్నారు. ఇవన్నీ చూస్తూంటే ప్రజారాజ్యం పవురు నిలబెట్టటానికి అల్లు అరవింద్ ప్రత్యేకమైన ఛానెల్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారా అనిపిస్తుంది. అయినా ఆయన ఛానెల్ పెడితే ఎంటర్టైన్మెంట్ కి మాత్రం లోటు ఉండదని అంటున్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications