హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడ?

By Staff
|
Google Oneindia TeluguNews

Ntr
హైదరాబాద్: ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఇప్పుడు కొత్త న్యూస్ చానల్స్ లో విజృంభిస్తున్నారు. ఆమె ఈ చానెల్స్ చాట్ ద్వారా చంద్రబాబు నాయుడి మీద తెగ విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి కేంద్రంలో ఆ సమయంలో తనకు అనుకూలమైన బిజెపి ప్రభుత్వం ఉన్నా ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇప్పించుకోలేదో చెప్పలని ఆమె ఒక టీవీ చానల్ చాట్ షోలో చాలా స్పష్టంగా ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాలపై వత్తిడి తేవడం హాస్యాస్పదమని ఆమె అన్నారు.

ఎన్టీఆర్ చివరి క్షణంలో అనుభవించిన ఆత్మక్షోభ ఆయన కుమార్తె పురంధరేశ్వరికి బాగా అర్ధమైందని లక్ష్మీ పార్వతి అన్నారు. వైస్రాయ్ డ్రామా జరిగినప్పుడు ఎన్టీఆర్ వెన్నుపోటుకు పురంధరేశ్వరి సహకరించినా ఇప్పుడామె నిజాలు తెలుసుకున్నారని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మాయాజాలంలో పడిపోయాడని, అతనికెంతో భవిష్యత్తు ఉందని అయినా అతను తప్పుదోవలో వెళ్తూ, తాత గారికే ద్రోహం చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

లక్ష్మీపార్వతికి సొంత పార్టీ ఉన్నా ఆమె ఇప్పుడు వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరి గుంటూరు జిల్లా నుంచి ఏదో ఒక టికెట్ సంపాదించాలని ఆమె తాపత్రయపడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అసహజ మరణానికి కారణం లక్ష్మీపార్వతి సంబంధాలేనని ఆరోపిస్తూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆమెను దూరంగా ఉంచుతున్నారు. బాగా చదువుకున్న లక్ష్మీపార్వతికి వాక్చాతుర్యం కూడా ఎక్కువే. చంద్రబాబు నాయుడిని దులిపిపారేయడానికి ఆమెను ఉపయోగించుకోవడం మంచిదని వైఎస్ కు ఆయన శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. చివరికి ఏం జరుగబోతోందో చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X