ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడ?
ఎన్టీఆర్ చివరి క్షణంలో అనుభవించిన ఆత్మక్షోభ ఆయన కుమార్తె పురంధరేశ్వరికి బాగా అర్ధమైందని లక్ష్మీ పార్వతి అన్నారు. వైస్రాయ్ డ్రామా జరిగినప్పుడు ఎన్టీఆర్ వెన్నుపోటుకు పురంధరేశ్వరి సహకరించినా ఇప్పుడామె నిజాలు తెలుసుకున్నారని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మాయాజాలంలో పడిపోయాడని, అతనికెంతో భవిష్యత్తు ఉందని అయినా అతను తప్పుదోవలో వెళ్తూ, తాత గారికే ద్రోహం చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మీపార్వతికి సొంత పార్టీ ఉన్నా ఆమె ఇప్పుడు వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరి గుంటూరు జిల్లా నుంచి ఏదో ఒక టికెట్ సంపాదించాలని ఆమె తాపత్రయపడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అసహజ మరణానికి కారణం లక్ష్మీపార్వతి సంబంధాలేనని ఆరోపిస్తూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆమెను దూరంగా ఉంచుతున్నారు. బాగా చదువుకున్న లక్ష్మీపార్వతికి వాక్చాతుర్యం కూడా ఎక్కువే. చంద్రబాబు నాయుడిని దులిపిపారేయడానికి ఆమెను ఉపయోగించుకోవడం మంచిదని వైఎస్ కు ఆయన శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. చివరికి ఏం జరుగబోతోందో చూడాలి.